Suryaa.co.in

Telangana

ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి..అందరం కలిసి వెళదాం!

– మీ తమ్ముడిగా రీక్వెస్ట్ చేస్తున్నా కృష్ణయ్య గారు ..
– బీసీల గురించి కవితకు మాట్లాడే అర్హత లేదు
– కవిత సత్రంలో భోజనం పెడుతుంటే కూడా సిఫార్సు లెటర్ కావాలి అనే రకం
– రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మార్గదర్శకం లో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ బిల్లును చట్టం రూపంలో చేసుకొని గవర్నర్ కి పంపిన. బీసీల గురుంచి కవితకు మాట్లాడే అర్హత లేదు. రాజ్యసభ సభ్యులు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య అంటే గౌరవం. ఢిల్లీ వస్తాం..మీరు ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి అందరం కలిసి వెళదాం. మీ తమ్ముడిగా రీక్వెస్ట్ చేస్తున్నా కృష్ణయ్య గారు!

మా నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా బీసీ విజన్ గురించి బల్ల గుద్ది చెబుతున్నారు. కవిత సత్రంలో భోజనం పెడుతుంటే కూడా సిఫార్సు లెటర్ కావాలి అనే రకం. సన్నాయి నొక్కులు నొక్కితే అర్థమే లేదు. సీఎం రేవంత్, టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నుంచి క్యాబినెట్ వరకు క్లియర్ కట్ గా ఉన్నాం.

పదేళ్ల లో బిఆర్ఎస్ బీసీలను పట్టించుకున్న పాపానపోలేదు. కేసీఆర్ కావొచ్చు ఆయన చుట్టూ ఉన్న దెయ్యాలు కావొచ్చు. ఎవరైనా సరే బీసీల కోసం మాతో కలిసి రండి. బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. బలహీన వర్గాలను పట్టించుకోని కవితతో కూర్చొని, మద్దతు గురించి కృష్ణయ్య మాట్లాడటం సమంజసం కాదు. బీసీ బిల్లుకి రాజకీయ రంగు పులమడం సబబు కాదు.

తెలంగాణలో 56 శాతం బీసీలు ఉన్నారు అన్నది క్లియర్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ మార్గదర్శకం లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ బిల్లును చట్టం రూపంలో చేసుకొని గౌరవ్ గవర్నర్ కి పంపిన.

LEAVE A RESPONSE