Suryaa.co.in

Andhra Pradesh

అనకాపల్లి నుంచి టిడిపిలోకి భారీగా వలసలు

-పార్టీలో చేరిన సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు
-కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నారా లోకేష్

అనకాపల్లి: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర అనకాపల్లి నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అనకాపల్లి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. జీవీఎంసీ 82వ వార్డులో నారా లోకేష్ యువగళం క్యాంప్ సైట్ లో గొలగం ఎంపీటీసీ, సర్పంచ్ చంద్రశేఖర్, అక్కిరెడ్డి వెంకటరమణ, పాడేరు నియోజకవర్గం లగిసపల్లికి సర్పంచ్ పార్వతమ్మ శనివారం టీడీపీలో చేరారు.

వీరితో పాటు అనకాపల్లికి చెందిన పలువురు వార్డు మెంబర్లు, మిల్క్ సొసైటీ సభ్యులు కూడా టీడీపీలో చేరారు. వీరందరికీ నారా లోకేష్ టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని, సర్పంచులను ఉత్సవ విగ్రహంలా ప్రభుత్వం మార్చిందని సర్పంచులు, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం లోకేష్ మాట్లాడుతూ…పంచాయతీలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తామని, పంచాయతీల నిధులు గ్రామాలాభివృద్ధికే ఖర్చు చేస్తామన్నారు. ఇప్పటికీ వెయ్యికోట్లకు పైగా పంచాయతీల ఖాతాల నుండి విద్యుత్ బకాయిల పేరుతో లాక్కున్న జగన్ రెడ్డి ప్రభుత్వం…ఖాతాల్లో ఉన్న మరో రూ.250 కోట్లు కూడా లాగేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మీ నియోజకవర్గాల్లో టీడీపీని అధికమెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరారు.

LEAVE A RESPONSE