Suryaa.co.in

Telangana

క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విశ్వ మానవాళికి ప్రేమను, కరుణను పంచిన యేసు క్రీస్తు పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 25న క్రిస్మస్ పండుగ నిర్వహించుకునే క్రైస్తవులందరికీ తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. ఏసు శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటారన్నారు. ఒక వైపు శాస్త్ర, సాంకేతిక రంగాలు గొప్పగా పురోగమిస్తున్నా, మరోవైపు మానవీయ విలువలు మృగ్యమైపోతున్న నేటి కాలంలో, క్రీస్తు బోధనలు ఆచరణీయమని తెలిపారు.

శత్రువునైనా క్షమించే గొప్ప గుణం ఉండాలని క్రీస్తు బోధించారని, సాటి మనుషుల పట్ల ప్రేమ, కరుణ, సహనం అనే సద్గుణాల ఆచరణ అనివార్యమైందని అన్నారు. ఏసుక్రీస్తు దీవెనలు ప్రజలందరికీ లభించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో ఏర్పడిన సెక్యులర్ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రగతిశీల భావంతో ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తూ పారదర్శకమైన పాలన అందిస్తుందన్నారు.

LEAVE A RESPONSE