Suryaa.co.in

Telangana

తెలంగాణా స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ అనే పుస్తకాన్నిఆవిష్కరించిన మంత్రి భట్టి విక్రమార్క

రాష్ట్ర ఆర్దిక, ప్రణాళిక, ఇంధన శాఖా మంత్రి మల్లు భట్టి విక్రమార్కను సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు కలసి అభినందనలు తెలియ చేశారు. ఇంధన శాఖా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ తోపాటు ఆ శాఖ ఉన్నతాధికారులు మంత్రిని కలసి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఆర్థిక శాఖ రూపొందించిన తెలంగాణా స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్ అనే పుస్తకాన్ని మంత్రి భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్ జి దయానందం, డిప్యూటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE