Suryaa.co.in

Telangana

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి వేముల

– శుభాకాంక్షలు తెలిపి రూల్స్ బుక్స్,ఐడి కార్డు అందజేత

శాసనమండలి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి,కోటిరెడ్డి,భాను ప్రసాదరావు,దండే విఠల్ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు.ప్రొటెం చైర్మన్ సయ్యద్
mlc2 అమినుల్ హసన్ జాఫ్రి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొత్త సభ్యులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ప్రొటెం చైర్మన్,అసెంబ్లీ సెక్రెటరీ నరసింహ చార్యులుతో కలిసి శాసనమండలి రూల్స్ బుక్స్,ఐడి కార్డు అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి,గంగుల కమలాకర్,కొప్పుల ఈశ్వర్, మహముద్ అలీ,ఇంద్రకరణ్ రెడ్డి,ఎర్రబెల్లి దయాకరరావు ప్రభుత్వ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,విప్ బాల్క సుమన్,రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఎంపీలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE