Suryaa.co.in

Telangana

గవర్నర్ పర్యటనకు ఎమ్మెల్యేలు డుమ్మా..

మహబూబ్ నగర్: రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతం చెంచుపెంటలో సాగుతున్న పర్యటనకు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది.

రాష్ట్ర ప్రథమ పౌరురాలు అయిన గవర్నర్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఆ పర్యటనలో పాల్గొని జయప్రదం చేయడం ఆనవాయితీ.

కానీ, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గవర్నర్ పర్యటనకు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కనీసం తన నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సైతం గవర్నర్ పర్యటనలో హాజరు కాకపోవడం రాజకీయంగా చర్చలకు దారి తీస్తోంది.

గత కొంత కాలం నుండి గవర్నర్ పర్యటనకు అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనకూడదని అధిష్టానం ఆదేశించడం వల్లే గవర్నర్ పర్యటనకు నాగర్ కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు సైతం దూరంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.

LEAVE A RESPONSE