2024లో నా కొడుకు ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తారు

-ఈడి దాడులు రాజకీయ దాడులు కానే కాదు
-ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి

మా పై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవి. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో మేము లేము.మేము 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారం లో ఉన్నాము. 8 రాష్ట్రాల్లో మా వ్యాపారాలు ఉన్నాయి. ఎక్కడ మచ్చ లేని వ్యాపారం చేస్తున్నాము. మా చెన్నె ,ఢిల్లీ వివాసాల్లో ఇడి దాడులు జరిగాయి. ఏ విధమైన ఆధారాలు, అక్రమాలు జరగలేదని ఈడి అధికారులు తేల్చారు… పంచనామాలో కూడా ఇదే రాశారు. మా పై నే కాదు ..దేశంలో 32 మంది వ్యాపారులపై కూడా సోదాలు చేశారు.

మా కుటుంబం రాజకీయాలో ,వ్యాపారాలలో నీతి గా ఉన్నాము. ఎక్కడ అక్రమాలకు పాల్పడిన దాఖలాలు లేవు. 2024 లో నా కొడుకు ఒంగోలు ఎంపీ గా పోటీ చేస్తారు. ఇది కేవలం వ్యాపారపరమైన ఈడి దాడులు గానే భావిస్తున్నాము. ఈడి దాడులు రాజకీయ దాడులు కానే కాదు.

Leave a Reply