Suryaa.co.in

Telangana

గ్రీన్ ఇండియా చాలెంజ్ లో మొక్కలు నాటిన న్యూఢిల్లీ కాన్సులేట్ ఆఫ్ లెసోతో మిస్టర్ తబాంగ్ లినస్ ఖోలుమో

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా హైదరాబాద్ శిల్పారామం లో మొక్కలు నాటిన న్యూ ఢిల్లీ హై కమిషన్ ఆఫ్ ద కింగ్డమ్ లెసోతో మిస్టర్ తబాంగ్ లినస్ ఖోలుమో..

ఈ సందర్భంగా మిస్టర్ తబాంగ్ లినస్ ఖోలుమో మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం అభినందనీయమని అన్నారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు.భారతీయులందరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు.అనివార్య స్థితిలో చెట్లను కట్ చేసిన మళ్ళీ వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు.మనం ఈ భూమిని విడిచిపెట్టిన మనం నాటిన చెట్లు మిగులుతాయని అన్నారు.ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమం లో సూరత్ సింగ్ మల్హోత్రా, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE