మునుగోడు ఉప ఎన్నిక ఒక కుక్కల కొట్లాట

YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

నియోజక వర్గంలో సమస్యలు పక్కన పెట్టీ… అందరూ మునుగోడు మీద పడ్డారు. ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం ఇచ్చారట. మందు తాగిస్తున్నారు… ఓట్లను కొంటున్నాడు. మునుగోడు లో వీదుల్లో కుక్కల కొట్లాట. పాలన మొత్తం గాలికి వదిలేశారు. ఎమ్మెల్యేలు,మంత్రులు మొత్తం మునుగోడు చేరారు. 118 నియోజక వర్గాల్లో పాలన గాలికి వదిలేసి… ఒక నియోజక వర్గం మీద పడ్డారు. ఇక కేసీఅర్ ఢిల్లీలో మకాం వేశారు. బిడ్డను అరెస్ట్ చేయకుండా లాబియింగ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారు. TRS ను BRS చేశారు… కోడి కొటర్ లు పంచుతున్నారు. ఇక్కడ దోచుకున్నది చాలదని…ఇక దేశం మీద పడ్డాడు.

బంగారు తెలంగాణ అని చెప్పి బ్రతుకే లేని తెలంగాణ చేశారు కదా..!. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని కేసీఅర్ చేతిలో పెడితే 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారు. తెలంగాణ లో కనీసం పండించిన పంటకి కూడా బరోసా లేదు. రైతు అంటే ఈ ప్రభుత్వానికి విలువే లేదు. కేసీఅర్ సార్ కి సీఎం పదవి కాదు…ఇప్పుడు PM పదవి కావాలట. కేసీఅర్ కి మాత్రం ఆశ చావదు…రైతులు మాత్రం 59 ఏళ్లకే చావాలా..?. కాళేశ్వరం,మిషన్ భగీరథ పేరు చెప్పి లక్ష కోట్లు కాజేశారు. పాలమూరు ప్రాజెక్ట్ కి 17 వేల కోట్లు ఖర్చు చేశారు…ఇప్పుడు అనుమతులు లేవట. జాతీయ పార్టీలు పెట్టీ విమానాలు కొనడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి .?. వేల కోట్ల విలువ జేస్తే ఆస్తులకు కేసీఅర్ కూడా బెట్టుకున్నారు. కేసీఅర్ అరాచకాలను ప్రశ్నించే పరిస్థితి తెలంగాణ లో లేదు. బండి సంజయ్,రేవంత్ రెడ్డి ఇద్దరు మెగా కృష్ణా రెడ్డి కి అమ్ముడు పోయారు. కాళేశ్వరం పై ఢిల్లీ స్థాయిలో ఉద్యమం నేను చేస్తున్న. బీజేపీ దగ్గర ఆధారాలు ఉన్నాయి…ATM అంటున్నారు…కానీ చర్యలు లేవు. తెలంగాణ లో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకే పార్టీ పెట్టాం

Leave a Reply