హైదరాబాద్ నగర అందాలను వీక్షించడానికి టిఎస్ ఆర్టిసి ప్రత్యేక బస్సులు..

-హైదరాబాద్ నగర టూరిస్టులకు అద్భుతమైన అవకాశం “హైదరాబాద్ దర్శిని”
-హైదరాబాద్ నగర చారిత్రక మరియు పర్యటక ప్రదేశాలను 12 గంటల్లో చూపిస్తాం.. !
-శనివారం మరియు ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఈ బస్సు సర్వీసులు -సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి నడపడం జరుగుతుంది..
-టిఎస్ ఆర్టిసి సంస్థను ప్రజలందరూ ఆదరించండి..
-ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో టిఎస్ ఆర్టిసి సంస్థ ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తుంది..
-ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని నూతన పథకాలను ప్రారంభిస్తాం
-నగర టూరిస్టుల కోసం ప్రత్యేక ప్యాకేజీలతో టిఎస్ఆర్టిసి బస్సులు సిద్ధం..
– గౌరవ టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి..

హైదరాబాద్, బస్ భవన్: హైదరాబాద్ అందాలను చూడడానికి వచ్చే టూరిస్టుల కోసం గౌరవ టిఎస్ ఆర్టిసి చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులుబాజిరెడ్డి గోవర్ధన్  “హైదరాబాద్ దర్శిని” పేరిట సిటీలో తిరిగే రెండు స్పెషల్ బస్సులను ప్రారంభించడం జరిగింది. పర్యాటక రంగాలను మరింతbaji అభివృద్ధి చెందే విధంగా ఆర్టీసీ సంస్థ నేరుగా పర్యటక మరియు చారిత్రక ప్రదేశాల వద్దకు బస్సు సర్వీసులను నడపడం సంతోషంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ నగర టూరిస్టులకు అణువుగా ఆర్టీసీ “హైదరాబాద్ దర్శిని” బస్సు సర్వీసులను ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేశారు. ఆయన హైదరాబాద్ నగర పర్యటక ప్రదేశాలను చారిత్రక కట్టడాలను 12 గంటల్లో చుట్టేసి వచ్చే విధంగా షెడ్యూల్ సిద్ధం చేశారు..

ఈ బస్సు సర్వీసులు శనివారం మరియు ఆదివారం సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు నడపడం జరుగుతుంది. ఈ ప్యాకేజీలకు ఆదరణ పెరిగితే మిగతా రోజుల్లో కూడా విస్తరిస్తామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. టిఎస్ ఆర్టిసి సంస్థను ప్రజలందరూ ఆదరించండి.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శీస్సులతో టిఎస్ ఆర్టిసి సంస్థ ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తుంది..

“హైదరాబాద్ దర్శిని” సిటీ టూర్ ఇలా..!!
1. సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుండి ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బస్సు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
2. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బిర్లా మందిర్ దేవస్థానం దర్శనం..
సమయం 9:00 గంటల నుండి 10:00bus-tour3. చౌల్ మహల్ ప్యాలెస్ సందర్శన.
సమయం ఉదయం 10:30 నుండి 12 గంటల 30 నిమిషాల వరకు.
4. పర్యాటక ప్రదేశమైన తారామతి బారదరి రిసార్ట్స్ లో మధ్యాహ్నం భోజనం.
సమయం 13:00 నుండి 13:45 వరకు.
5. గోల్కొండ కోట సందర్శన
సమయం 14:00 నుండి 15:30 వరకు.
6. దుర్గం చెరువు పార్క్ సందర్శన
సమయం 16:00 నుండి 17:00 వరకు.
7. కేబుల్ బ్రిడ్జ్ సందర్శన
సమయం 17:30 నుండి 18:00 వరకు.
8. హుస్సేన్ సాగర్ మరియు ఎన్టీఆర్ పార్క్ సందర్శన
18:30 నుండి 19:30 వరకు.
పర్యటక మరియు చారిత్రక ప్రాంతాలను వీక్షించిన అనంతరం తిరిగి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్దకు రాత్రి 20.00 చేర్చడం జరుగుతుంది.

గమనిక అల్పాహారం మరియు భోజన ఖర్చు ప్రయాణికులదే దీనిలో 10% డిస్కౌంట్..
టిఎస్ ఆర్టిసి మెట్రో ఎక్స్ప్రెస్.

1. పెద్దలకు 250 రూపాయలు.
2. పిల్లలకు 130 రూపాయలు.

టీఎస్ ఆర్టీసీ మెట్రో లగ్జరీ A/C
1. పెద్దలకు 450 రూపాయలు.
2. పిల్లలకు 340 రూపాయలు.
టికెట్లు బుక్ చేసుకోవడానికి టిఎస్ ఆర్టిసి వెబ్సైట్ను www.tsrtconline.in సందర్శించండి.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాలను కళాశాల విద్యార్థులు మరియు యాజమాన్యాలు, పాఠశాల విద్యార్థులు, మరియు ప్రకృతి ప్రేమికులు విహారయాత్రలు చేసేవారు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు..

Leave a Reply