దేవాలయాల వద్ద మళ్లీ వ్యాపారాల కోసం ముస్లింల అభ్యర్ధన

– తప్పయిపోయిందని స్వామీజీ వద్ద క్షమాపణలు
– మీ గుళ్లే మాకు దిక్కని వేడుకోలు
– పెజావర్ స్వామికి శాల్యూట్!
– తెలుగు పీఠాథిపతులు ఇకనయినా నిద్రలేస్తారా?

హిజాబ్ రగడ జరిగిన కర్నాటకలో ఇదో అద్భుత దృశ్యం. హిందువులు, ప్రభుత్వాలు తమపై వివక్ష ప్రదర్శిస్తున్నారంటూ ఆందోళన జరిపిన అదే ముస్లిములు.. ఓ స్వామీజీ వద్దకు వెళ్లి, ‘‘తప్పయిపోయింది. క్షమించండి. మళ్లీ మీ దేవాలయాల వద్ద వ్యాపారాలు చేసుకుంటాం’’ అని అభ్యర్థించిన సంఘటన ఇది. కారణం.. హిజాబ్ ఘటన తర్వాత దేవాలయాల వద్ద ముస్లిముల వ్యాపారాలపై నిషేధం విధించడమే. మతం కోసం కొంతమంది ప్రదర్శించిన అత్యుత్సాహం, అదే మతానికి చెందిన కొన్ని వందలమంది జీవనోపాథి కోల్పోయే ప్రమాదం తెస్తుందనడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. ఇలాంటి స్వామీజీలు ఏపీ, తెలంగాణలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించరు. ముఖ్యమంత్రులు, రియల్టర్లు, రాజకీయనేతలు, భూస్వాములు, పారిశ్రామికవేత్తల చుట్టూ తిరిగే స్వాములే తప్ప.. భక్తుల మనోభావాల మేరకు నడుచుకునే స్వాములు తెలుగు రాష్ట్రాల్లో కాగడా వేసి వెతికినా కనిపించరు. కన్నడ స్వామిని చూసి తెలుగు పీఠాధిపతులు సిగ్గు తెచ్చుకుంటే మంచిదన్నది హిందువుల మనోభావన.అందుకే పెజావర్ స్వామికి శాల్యూట్!

ఇక పెజావర్‌కు వెళితే…
హిజాబ్ కోసం వాళ్ళు చేసిన రబస వాళ్ళ జిహాదీల మెడకే ఉచ్చులా మారింది.
ఉడిపిలోని హిందూ దేవాలయాల దగ్గర వార్షిక జాతరల వద్ద, ముస్లింలు వ్యాపారం చేయరాదని దేవాలయాల కమిటీల నిర్ణయంతో.. ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయిన ముస్లిం వ్యాపారులు మార్చి 30 బుధవారం పెజావర్ మఠంలోని శ్రీరామ విట్టల సభావనంలో పెజావర్ మఠం అధిపతి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీని కలుసు కున్నారు.

తమను దేవాలయాల వద్ద జరిగే జాతరలలో గతంలో లాగానే, హిందూ జాతరలలో ఆలయాల దగ్గర వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతించాలని స్వామీజీని వేడుకున్నారు. దీనిపై స్పందించిన పరమపూజ్య శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ.. సమాజంలో శాంతియుత జీవనానికి అనుకూలమైన వాతావరణం ఉండాలంటే, శాంతి మరియు సామరస్య సహజీవనం చాలా అవసరమని చెప్తూ.. ఈ శాంతి బాధ్యత కేవలం ఒక సమాజానికి భారం కాదని, అలాగే కేవలం ఒక సమాజం వల్ల శాంతిని సాధించలేమని అన్నారు.

‘‘ హిందువులమైన మేము చాలా కాలంగా బాధను, వేదననూ అనుభవించాము. ఇంకా అనుభవిస్తున్నాము కూడా.అనేక చేదు అనుభవాల కారణంగా, హిందూ సమాజం వేదనలో కూరుకుపోతోంది.
ఇంత గంభీరమైన విషయాన్ని, కొంతమంది మత పెద్దల మధ్య పరస్పర చర్చలతో ఈ సమస్యను పరిష్కరించలేము. అట్టడుగు స్థాయిలో శాశ్వత పరిష్కారం కనుగొనాలి..
ఒక మత సమూహం నిరంతరం అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు, దానిలో నిరాశ మరియు కోపం కట్టలు తెంచుకుంటుంది..తీవ్రమైన ఆవేదన చెందిన హిందూ సమాజం మీ యొక్క అన్యాయాలతో విసిగిపోయింది.మనం వేదికపై కూర్చుని ఈ పరిస్థితికి కారణాలను చర్చించాలి. హిందూ సమాజం నిరంతరం మతపరమైన వివక్ష మరియు హింసకు గురికాకుంటే , మళ్లీ సామరస్యం నెలకొంటుందని ఆశ ఉంది. మీవారు చేసిన ఒక దారుణాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను.

ఒక హిందూ వితంతువు పశువుల కొట్టంలోని ఆవులన్నీ దొంగిలించబడ్డాయి..చంపివేయబడ్డాయి ..ఆమె జీవనోపాధి ఛిన్నాభిన్నమైంది. దానివలన ఆవిడ ఉపాధి కోల్పోయి వీధుల్లోకి నెట్టబడింది..అంతేకాదు ఆవిడ తాను పైకి చెప్పుకోలేని అవమానానికి గురైంది దీనికి కారణం మీ వర్గమే.

ఇటువంటి మరియు మరెన్నో క్రూరమైన సంఘటనలు, హిందువులలో చాలా బాధను కలిగించాయి. ఇటువంటి పరిస్తితిలో కేవలం మాటలు రూపంలో పైకి నటిస్తూ చెప్పే శాంతి సహజీవనం మాటలతో ‘ శాంతిని సాధించలేము అలాగే సహజీవనం ‘ కూడా సాధ్యం కాదు. మీరు మనఃస్పూర్తిగా నోటితో చెప్పేది చేతలలో చూపిస్తే, మూడవ వ్యక్తి మధ్యవర్తిత్వం అవసరం లేదు.

మీరు చేసిన హిజాబ్ పోరాటం ఫలితంగా మాత్రమే, ముస్లిం వ్యాపారుల ఆర్థిక బహిష్కరణ జరిగిందని భావించకండి. హిందూ సమాజం పరమపావన స్థానాలుగా భావించే మఠాలు..దేవాలయాల దగ్గర, మీరు హిజాబ్ కు అనుకూలంగా మీరు చేసే వ్యాపారాలు మూసివేశారు..దీనివలన హిందూ సమాజం మరింతగా కోపోద్రిక్తురాలయింది. దీనివలన మీకు జరిగిన నష్టంతో పోలిస్తే, హిందూ సమాజం ఎదుర్కొన్న ఇబ్బందులే ఎక్కువ..ఒక ధర్మనిష్ఠ కలిగిన హిందూ కార్యకర్తను కూడా, హిందూ సమాజం కోల్పోయింది..
నిజానికి నేను మీకు ఇచ్చే సలహా!! మీరు ఏదైతే సమస్యను ఎదుర్కుంటున్నాము అని భావిస్తున్నారో , ఆ సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరించాలని నేను భావిస్తున్నాను.

మీ సమాజం తప్పు చేసిన వారిని ముందు శిక్షించనివ్వండి..అలాగే మీరు ఇతరులకు చేసిన తప్పులను పరిష్కరించండి..మీవారిలో తప్పు చేసిన సభ్యులపై నిరసన తెలియజేయండి. వాళ్ళను ఈసారి ఇదే తప్పు చేయకుండా ఆపండి.

ఒకరు చేసే తప్పుడు పనులు, మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. తప్పులు చేసేవారిని మీ సమాజం అడ్డుకొని ఉంటే, హిందూ సమాజానికి ఇంత బాధ ఉండదు. కనుక ముందుగా మీరు మీ సమాజంలో ఎక్కడ తప్పు జరిగిందో, దాన్ని సరిదిద్దుకొని సమస్యను పరిష్కరించుకొండని స్వామీజీ వాళ్ళకు మృదువుగానే కఠినంగా తెలియచేసారు ’’
వాహ్!! ఇలాంటి హిందూ స్వామీజీలు కదా మనకు కావాలి.
స్వామీజీ తీసుకున్న తన దృఢమైన స్టాండ్ కోసం వారికి పాదాభివందనం..

ఇదే కేరళలోనో..ఆంధ్రాలోనో..తెలంగాణలోనో..తమిళనాడులోనో జరిగి ఉంటే, హిందువులుగా మరియు జాతీయవాదులుగా చెప్పుకునే కొందరు మూర్ఖులు వెంటనే జిహాదీలను కౌగిలించుకొని…వాస్తవానికి వాళ్ళు బాగున్నారు… అది వాళ్ళ మతం..వాళ్ళ ఆచారాలు వాళ్ళు పాటించుకుంటే తప్పేంటి? అని మిగిలిన హిందువులందరినీ హోల్ సేల్ గా పిచ్చోళ్లని చేసేవారు.

ఈ యుద్ధంలో ఎలా పోరాడాలో తెలిసిన స్వామీజీ లు ఉన్నారని కన్నడిగులు నిరూపించారు.
కన్నడ సోదరులకు, పరమపూజ్య స్వామీజీ శ్రీశ్రీశ్రీ విశ్వప్రసన్న తీర్ధుల వారికి సాష్టాంగ ప్రణామం.

– ఎం.బి.అప్పారావు దొర

Leave a Reply