Suryaa.co.in

Telangana

అయోధ్య నుండి అగర్తల దాకా నమో నమామి

-ఇస్తాంబుల్ నుండి ఇస్లామాబాద్ దాకా యావత్ ఫ్రపంచమంతా మోదీ హవానే
-తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం దేశమంతా ఎదురుచూస్తోంది
-తెలంగాణలోనూ కాషాయ జెండా ఎగరేస్తాం
-కాషాయ జెండా ధగధగలతో ఇతర పార్టీల జెండాలన్నీ నామరూపాల్లేకుండా పోతున్నయ్
-తెలంగాణలో అప్పులు తీరాలన్నా… అభివ్రుద్ది జరగాలన్నా డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
-సంజయ్ సమక్షంలో పెత్త ఎత్తున బాణాసంచా పేల్చి సంబురాలు చేసుకున్న కార్యకర్తలు

ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ విజయ కేతనం ఎగరేయడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ పట్ల నమ్మకంతో ఓటేసిన ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అయోధ్య నుండి అగర్తల వరకు నమో నమోమి అంటున్నారని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించడంతోపాటు మేఘాలయలో బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఈరోజు బొంగులూరు సమీపంలోని కళ్లెం జంగారెడ్డి గార్డెన్ వద్ద పెద్ద ఎత్తున బాణా సంచా పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబురాలు జరుపుకున్నారు. కార్యకర్తలతో కలిసి సంబురాల్లో పాల్గొన్న బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే…

నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మేఘాలయలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు. ఈశాన్య రాష్ట్రాల అభివ్రుద్దికి ప్రత్యేక నిధులిస్తూ నరేంద్రమోదీగారికి, జేపీ నడ్డాగారికి మద్దతివ్వడం చాలా సంతోషం. మొత్తం పరిశీలిస్తే అయోధ్య నుండి అగర్తల దాకా నమో నమామి. ఇస్తాంబుల్ నుండి ఇస్లామాబాద్ దాకా యావత్ ప్రపంచం నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని కొనియడాతున్నాయి. నరేంద్రమోదీ ఆధ్వర్యంలో దేశం అగ్రపథంలో దూసుకుపోతోంది.

గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేయలేని పరిస్థితి. తెల్ల జెండాలే పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి. ఈ ఫలితాలతో కాషాయ జెండా దమ్ము చూపెట్టారు. కాషాయ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నరు. కమ్యూనిస్టుల జాడ లేకుండా పోయింది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే మఠాషే. ఎక్కడికి పోయినా మోదీ హవానే కొనసాగుతోంది. ప్రజలు వాస్తవాలను గ్రహించి బీజేపికి పట్టం కడుతున్నారు. తెలంగాణలో కాషాయ రాజ్యం రాబోతోంది. ఈశాన్య రాష్ట్రాల నుండి కాషాయ జెండాల నుండి వచ్చే ధగధగలకు మిగిలిన జెండాలన్నీ నామరూపాల్లేకుండా పోతున్నయ్.

ఏ లక్ష్యం కోసం తెలంగాణను ఏర్పాటు చేసుకున్నామో… బీజేపీతోనే లక్ష్యం నెరవేరుతుంది. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ మరింత మెరుగ్గా అమలు చేస్తాం. ఉచిత విద్య, వైద్యంతోపాటు పేదలందరికీ ఇండ్లు కట్టిస్తాం. రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం. తెలంగాణలోని అప్పులన్నీ తీరాలంటే… సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే.. అభివ్రుద్ధి జరగాలంటే బీజేపీతోనే సాధ్యం. తెలంగాణలో బీజేపీ గెలవాలని దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నరు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే దేశమంతా ఉత్సవాలు చేసుకునే రోజులు రాబోతున్నాయి.

LEAVE A RESPONSE