Suryaa.co.in

Telangana

నారాయణఖేడ్ దుండగులను శిక్షించాలి

-ఎస్ పి కి కలిసిన విహెచ్ పి, బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో శనివారం రాత్రి జరిగిన ఘటనలో దుండగులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర అధ్యక్షుడు రామారావు బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్ డిమాండ్ చేశారు.
సోమవారం జిల్లా జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జిల్లా ఎస్పీ రమణకుమార్ కు కలిసి కోరినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణఖేడ్లో అక్రమంగా గోవులను తరలించే ముఠా కావాలని పథకం ప్రకారం భజరంగ్దళ్ నాయకుల పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రోజురోజుకు గో అక్రమ రవాణా దారులు ఆగడాలు ( ముస్లింల) అరాచకాలు పెరుగుతున్నాయని ఇప్పటికైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారుజిల్లా ఎస్పీ స్పందించి ఎవరైనా సరే కఠినమైన చర్యలు తీసుకుంటాం అని వచ్చిన బజరంగ్ దళ్ నాయకులకు హామీ ఇచ్చారు. ఇంకా ఎస్పి ని కలిసిన వారిలో అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొండాపురం జగన్. బిజెపి రాష్ట్ర నాయకులు సంగప్ప, VHP జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ బజరంగ్ దళ్ నాయకులు జగదీశ్ ,ప్రశాంత్ ,దశరథ్ ,కృష్ణ తదితరులు ఉన్నారు.

LEAVE A RESPONSE