Suryaa.co.in

Telangana

నరేంద్ర మోదీ అనే మెడిసిన్ కు ఎక్స్పైరీ తేదీ అయిపోయింది

– రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పనిచేయదు
-ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయం
– డబుల్ ఇంజన్ అంటే ఆదానీ.. ప్రధాని
– కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నాగపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు. 150 రోజులు 4వేలకు పైగా కిలోమీటర్లు రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారు. భారత్ జోడో యాత్ర స్పూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటక తరువాత జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించింది…. తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ తరువాత జోడో యాత్ర మహారాష్ట్రలో ప్రవేశించింది. ఈ సారి మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

ఇప్పుడు రాహుల్ భారత్ న్యాయ యాత్ర మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు చేపట్టనున్నారు. ఈసారి దేశంలో ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయం.. దీన్ని మోదీ కూడా ఆపలేరు. ప్రతీ మెడిసిన్ కు ఒక ఎక్సపయిరీ తేదీ ఉంటుంది. నరేంద్ర మోదీ అనే మెడిసిన్ కు కూడా ఎక్సపయిరీ తేదీ అయిపోయింది. రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పనిచేయదు.

డబుల్ ఇంజన్ సర్కార్ అని బీజేపీ పదే పదే చెబుతుంది. డబుల్ ఇంజన్ అంటే ఆదానీ.. ప్రధాని. లోక్ సభలో రాహుల్ గొంతు విప్పడంతో ఆదానీ ఇంజన్ ఆగిపోయింది.. షెడ్ కు పోయింది. ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర తో ప్రధాని ఇంజన్ ఆగిపోవడం ఖాయం…. షెడ్డుకు పంపడం ఖాయం. కాంగ్రెస్ శ్రేణులారా వందరోజులు దేశం కోసం పనిచేయండి. కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయండి. దేశంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి… దేశాన్ని కాపాడుకుందాం.

LEAVE A RESPONSE