Suryaa.co.in

National

నీట్‌ పీజీ 2024 దరఖాస్తులు ప్రారంభం

న్యూఢిల్లీలోని నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) 2024-25 విద్యా సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్‌ కాలేజీల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సు ల్లో ప్రవేశాలకు నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌ పీజీ) 2024 పరీక్ష నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు మే 6వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్‌ 23వ తేదీన నీట్‌ పీజీ పరీక్ష నిర్వహిస్తారు.

ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎండీ/ ఎంఎస్‌/ పీజీ డిప్లొమా తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఎంబీబీఎస్‌ డిగ్రీ లేదా ప్రొవిజనల్‌ ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. అర్హులైన వారు ఆన్‌లైన్‌లో మే 6వ తేదీ రాత్రి 11.55 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్ష రుసుము కింద జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.3,500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.2,500 చొప్పున చెల్లించాల్సి ఉంది.

రాత పరీక్షా విధానం
నీట్‌ పీజీ 2024 పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. పరీక్ష మొత్తం మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నల రూపంలో జరుగుతుంది. ప్రశ్నాపత్రం కేవలం ఇంగ్లీషు మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. మొత్తం 3 గంటల 30 నిమిషాల వ్యవధిలో పరీక్ష ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు ఇవే..
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్‌ 16
దరఖాస్తులకు చివరి తేదీ: మే 6
అడ్మిట్‌ కార్డుల విడుదల: జూన్‌ 18
పరీక్ష తేదీ: జూన్‌ 23
ఫలితాల వెల్లడి: జూలై 15
ఇంటర్న్‌షిప్‌ కంప్లీషన్‌ కటాఫ్‌ తేదీ: ఆగస్ట్‌ 15

LEAVE A RESPONSE