ఆయన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి. అయినా… తన స్వగ్రామంలో, సొంత ఇంటి చిరునామాపై ఓటరుగా నమోదు చేయించుకోవడానికి… ఏకంగా కోర్టునే ఆశ్రయించాల్సి వచ్చింది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాల గ్రామంలో.. తనకు ఓటు హక్కు కల్పించమని, ఏపి మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసుకొన్న దరఖాస్తును, స్థానికంగా నివాసం ఉండటంలేదు అనే కారణంతో తిరస్కరించారు. చివరికి కోర్టు ఆదేశాలతో, నిమ్మగడ్డను దుగ్గిరాలలో ఓటరుగా నమోదు చేశారు .