Suryaa.co.in

Andhra Pradesh

కాకాణి కోసం పనిచేసే ఏ అధికారినీ వదిలిపెట్టం

– మద్యం డంపుల వెనుక…డాన్‌ కాకాణే…
-మంత్రిగా వెలగబెడుతున్నా ఆయన బుద్ధి మారలేదు

-2014 ఎన్నికల్లోనూ గోవా మందుతో అమాయకులను చంపాడు
-మళ్లీ ఇప్పుడు కూడా లక్షల సీసాలు దించేశాడు
-పంటపాళెం, విరువూరులో దొరికిన మద్యం ఎక్కడిది?
-దుకాణాల నుంచి తెచ్చారా..డిస్టిలరీస్‌ నుంచి దించారా?
-గోవా నుంచి తెచ్చి లేబుళ్లు మార్చారా?
-అక్రమ నిల్వలపై సమగ్ర దర్యాప్తు చేయించాలి
-ఆయనపై ఏ1గా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి
-ఈ విషయంపై ఆర్వో నుంచి ఈసీ వరకు ఫిర్యాదు చేస్తాం
-ఎస్పీ కార్యాలయం సాక్షిగా మా ఫోన్ల ట్రాక్‌ చేస్తున్నారు
-సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

సర్వేపల్లి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికై మంత్రిగా వెలగబెడుతున్నా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బుద్ధి మారలేదని టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మళ్లీ జనంతో చెత్త మందు తాగించి చంపేందుకు ప్రమాదకరమైన మద్యాన్ని ఊళ్లలోకి దించాడని ఆరోపించారు. ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలోి ముత్తుకూరు మండలం పంటపాళెం, పొదలకూరు మండలం విరువూరులో రెండు డంపులు దొరికాయి. పంటపాళెంలో మద్యంతో చిక్కిన మారు సుధాకర్‌ రెడ్డి వైసీపీ కీలక నేతే కాక కాకాణికి వ్యాపారంలోనూ, టోల్‌ గేటు లోనూ భాగస్తుడ న్నారు. సుధాకర్‌ రెడ్డి వద్ద 4,232 మద్యం సీసాలు దొరికాయని, వాటిలో వైట్‌ హాల్‌తో పాటు సర్వేపల్లి ఎస్‌ఎన్‌జే డిస్టిలరీలో తయారయ్యే రాయల్‌ ప్యాలెస్‌ సీసాలు న్నాయని పేర్కొన్నారు. నిన్న మళ్లీ పొదలకూరు మండలం విరువూరులో వైసీపీ నేత చిర్ల రాజగోపాల్‌రెడ్డి రైసుమిల్లు లో 2069 సీసాలు చిక్కాయి.

పంటపాళెంలో సుధాకర్‌ రెడ్డితో పాటు ఆయన డ్రైవర్లపై కేసు పెట్టారు. విరువూరులో రైసుమిల్లు యజమాని రాజగో పాల్‌రెడ్డి తో పాటు కాపాలదారుపైనా కేసు కట్టారు. ఆ 6300 మద్యం సీసాలు ఎవరి ప్రయోజనాల కోసం తెచ్చారనే అంశంపై అధికారులు దృష్టి సారించకపోవడం సరికాదన్నారు. కాకాణికి ప్రయోజనం కలిగించేందుకే భారీఎత్తున మద్యం డంప్‌ చేశారని, ఆయనపై కేసు పెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 ఎన్నికల్లోనూ నాలుగు డంప్‌లు దొరికాయి. అప్పట్లో గవర్నర్‌ పాలనలో ఎక్సైజ్‌ అధికారులు సమగ్ర విచారణ జరిపి నాలుగు కేసుల్లో కాకాణిని నిందితుడిగా తేల్చారు. లేబుళ్లు మార్చి అమాయకుల ప్రాణాలు తీసేందుకు కాకాణి వెనుకాడడు. కల్తీ మద్యం కేసుల్లో కాకాణికి సహ నిందితులుగా పాండిచ్చేరి, బెంగళూరు, చెన్నై, గోవాకు చెందిన మద్యం మాఫియా డాన్లు ఉన్నారు. చెన్నైకు చెందిన ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌ అప్పూ ఇదే కేసులో జైలులో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తుచేశారు.

అటవీ ప్రాంతంలో మద్యం సీసాల రీ ప్యాకింగ్‌…
ఎస్‌.ఎన్‌.జే డిస్టలరీస్‌ యాజమాన్యాన్ని కాకాణి బెదిరించి రాయల్‌ ప్యాలెస్‌ బ్రాండ్‌తో వ్యాపారం చేస్తున్నాడని మూడేళ్లుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు. పంటపాళెం, విరువూరులో ఎక్కువ సంఖ్యలో దొరికింది ఈ మందు సీసాలే. సీజ్‌ చేసిన మద్యం బాటిళ్లపై బార్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఏ దుకాణానికి కేటాయించిన స్టాకో స్పష్టంగా అర్థమవుతుందని, ఆ దిశగా అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. అసలు స్థానిక డిపోల నుంచి ఈ మద్యాన్ని తీసుకొచ్చారా? లేక మరోసారి గోవా నుంచి ప్రమాదకరమైన మందును తెచ్చి లేబుళ్లు మార్చారా? అన్న అనుమానం వ్యక్తం చేశారు.

రెండు నెలల క్రితం 1.44 లక్షల మద్యం సీసాలను పాలిచెర్లపాడు అటవీ ప్రాంతంలో లారీల నుంచి దించి రీ ప్యాకింగ్‌ చేసిన తర్వాత ఊళ్లలోని రహస్య ప్రదేశాలకు తరలించినట్టు మాకు సమాచారం ఉంది. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చే నాటికి ఏ అధికారి స్పందించే పరిస్థితిలో లేరు. పొదలకూరు మండ లం తాటిపర్తి వరదాపురం మైన్‌లో పట్టపగలే ఒక ట్రక్కు ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు చూపించినా ఒక్కరిపై కూడా కేసు నమోదు చేయలేదన్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ ఇప్పుడైనా స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. కాకాణి అనుచరుల ఇళ్లు, మిల్లుల్లో మళ్లీ మద్యం డంప్‌లు దొరుకుతుంటే ఎస్పీ ఎందుకు స్పందించి ఆయనను అరెస్ట్‌ చేయరని ప్రశ్నించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న మద్యం దందాపై రిటర్నింగ్‌ అధికారి నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్‌ వరకు అందరికీ ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

ఎస్పీ ఆఫీసు సాక్షిగా సెల్‌ఫోన్ల ట్రాక్‌…
సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడేళ్లు ఎస్సైగా పనిచేసిన వ్యక్తిని ఇఫ్పుడు కాకాణి స్పెషల్‌ బ్రాంచ్‌ లో వేయించుకున్నాడు. ఎస్పీ కార్యాలయంలోనే ఉంటున్న ఆ ఎస్సై మాతో పాటు మా అను చరుల ఫోన్లు ట్రాక్‌ చేస్తూ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కాకాణికి సమాచారం ఇస్తున్నారు. స్పెషల్‌ బ్రాంచ్‌లో ఎస్సై శివకృష్ణారెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ రామకృష్ణారెడ్డి ఇదే పనిలో ఉన్నారు. వీరిద్దరూ ఆయనకు దగ్గర బంధువులు. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమ మద్యం రవాణా, డంప్‌ల నిర్వహణ మొత్తం ఎస్సై శివకృష్ణారెడ్డి పర్యవేక్షణలోనే జరుగుతోంది. కాకాణి కి కొమ్ముకాస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఈ ఇద్దరు అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎస్సై శివకృష్ణారెడ్డి వాడుతున్న పర్సనల్‌ ఫోన్‌ కాల్‌ డేటాతో పాటు ఆయన క్రెటా కారు(రిజిస్ట్రేషన్‌ నంబర్‌ 10)లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో గూగూల్‌ టేకవుట్‌ తీస్తే బండా రం మొత్తం బయటపడుతుందన్నారు.

మంత్రికి ఓఎస్డీగా వ్యవహరిస్తున్న ఎంపీడీఓ సరళ అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని మానిటర్‌ చేస్తూ కాకాణి కోసం చాలా కష్టపడుతోంద న్నారు. ఎంపీడీఓల స్థానంలో 20 ఏళ్లుగా ఇక్కడే వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారిని నియ మించి స్వామి భక్తి ప్రదర్శించుకుంటోందని వ్యాఖ్యానించారు. నేను ఈసీకి ఫిర్యాదు చేసే వరకూ జిల్లా అధికారులు స్పందించలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆమె నెల్లూరు జిల్లా లో విధులు నిర్వర్తించేందుకు అవకాశమే లేదు. నిబంధనలు ఉల్లంఘించి అధికార దుర్విని యోగానికి పాల్పడుతున్న ఏ అధికారినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

LEAVE A RESPONSE