-వెల్లంపల్లి…కారుకూతలు మానుకో
-అక్రమ కేసులలో ఇరికించి గెలవలేవు
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
దొంగచాటుగా వెళ్లి బొండా ఉమ నామినేషన్ వెశాడంటూ అనవసరంగా వెల్లంపల్లి కారుకూతలు కూస్తున్నాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొండా ఉమ ఎప్పుడూ ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ వేయలేదన్నారు. అనవసరంగా వెల్లంపల్లి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వెల్లంపల్లి తలకిందులుగా తపస్సు చేసినా ఆయనపై గెలవడం సాధ్యం కాదన్నారు. దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం అయినప్పుడే వెల్లంపల్లి అవినీతి బాగోతం రాష్ట్రం మొత్తానికి తెలిసిందని దుయ్యబట్టారు. వైసీపీ డ్రామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పారు. పూల దండతో అయిన గాయానికి రాజకీయం కోసం అక్రమంగా వడ్డెర బిడ్డను ఇరికించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లికి డిపాజిట్ కుడా వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.