Suryaa.co.in

Andhra Pradesh

పోలీసు బాస్ లకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి?

– విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

విశాఖని రాబంధుల్లా పీక్కుతింటున్నారు వైసిపి కబ్జాకోరులు. కన్నుపడిన ప్రతిగజాన్ని కబ్జా చేస్తూ విశాఖపట్నాన్ని విషాదపట్నంగా మార్చేస్తున్నారు. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఎస్పీకి చెందిన స్థలాన్నే వైసిపి ఎంపీ ఆక్రమించడం వైసిపి కబ్జాపర్వంలో సరికొత్త కోణం. స్థలం కబ్జా చెయ్యడమే కాకుండా రివర్స్ లో

ఎంపీ మనుషులు ఎస్పీకే వార్నింగ్ ఇవ్వడం విశాఖలో వైసిపి ల్యాండ్ మాఫియా అరాచకాలకు అద్దం పడుతుంది. ప్రజల్ని కాపాడే పోలీసు బాస్ లకే ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? విశాఖపట్నంలో వైసిపి కబ్జాల పర్వానికి ముగింపు పలకాలి. బాధితులంతా బయటకు రండి…వైసిపి కబ్జా కోరల నుండి విశాఖని రక్షించుకుందాం… మీకు అండగా టిడిపి పోరాడుతుంది.

LEAVE A RESPONSE