కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగిసింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, భాజపా అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. ఈనెల 30న హుజూరాబాద్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. నవంబరు 2న ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంటుంది. నామినేషన్ వేసేందుకు ఉపాధిహామీ పథకం క్షేత్రసహాయకులు భారీగా తరలివచ్చినప్పటికీ నిబంధనల ప్రకారం వారిని అనుమతించలేదు.