Suryaa.co.in

Andhra Pradesh

అరాచక పాలన అంతం మా కూటమి పంతం

-జగనాసుర రక్త చరిత్ర ఒక్క రోజు కూడా రాష్ట్రంలో ఉండటానికి వీలులేదు
-జగన్ ఛార్జ్ షీట్ విడుదల చేసిన కూటమి నేతలు
-జగన్ ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై ఎన్డీయే కూటమి నేతలు ఛార్జ్ షీట్ విడుదల
-జగన్ ఐదేళ్ల పాలన అవినీతి, అక్రమాలపై కూటమి నేతల మీడియా సమావేశం
-టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయ కర్త పేరాలశేఖర్ రావు, టీడీపీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి అశోక్ బాబు, బిజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్, జనసేన అధికార ప్రతినిధి పి.గౌతమ్

జగన్ రెడ్డి అంటేనే ఒక అబద్దాల కోరు : టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
జగన్ రెడ్డి తన అధికారాన్ని కొనసాగించాలని, మరోసారి రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టాలని రాష్ట్ర ప్రజలను భ్రమలోకి తీసుకోవాలని. ఒక్కఛాన్స్ అంటూ అబద్దాలు చెప్పి, అస్యతాలు, అసాధ్యపు వాగ్దానాలతో ఎలా అధికారంలో వచ్చాడో మరలా రేపు మరో అబద్దపు మేని ఫెస్టోను విడుదల చేయడానికి జగన్ రెడ్డి సిద్దం అయ్యాడు. ఎన్ని మాయ మాటలు చెప్పినా ఎన్ని అబద్దాలు చెప్పినా జనం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి సిద్ధంగా ఉన్నారు.

వైసీపీ మేనిఫెస్టో అంతా బూటకం జగన్ రెడ్డి అంటేనే ఒక అబద్దాల కోరు
జగన్ రెడ్డి ముందు పుట్టి తరువాత అబ్ధం పుట్టింది. అబద్దం చెప్పడంలో అంతటి ఘనుడు జగన్ రెడ్డి. మద్యపాన నిషేదం చేసిన తరువాతే ఓటు అడుగుతానన్న జగన్ మద్యపాన నిషేదం చేశారా . మీరు అమ్మిన చవకబారు మద్యానికి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తెలుగు మహిళలలపుస్తెలు తెగాయి. వారంలో సీపీస్ రద్దు చేస్తామని చెప్పారు. ఏటా ఐదు లక్షల ఇళ్లు కడతానని చెప్పారు. మరి 99% ఎప్పుడు అమలు చేశారు.

అరాచక పాలన అంతం మా కూటమి పతంతం. జగనాసుర రక్త చరిత్ర పాలన ఇక ఒక్క రోజు కూడా ఉండటానికి లేదు. స్టేట్ టెర్రరిజాన్ని ప్రోత్సహించిన ఘనాపాటి జగన్ రెడ్డి. జగన్ రెడ్డిపాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. రాజ్యాంగం ఎగతాలి చేయబడింది. అందుకే జగన్ రెడ్డి మేనిఫెస్టో కంటే ముందే కూటమి ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. పనికిమాలిన ఛీప్ మినిస్టర్. అబద్దాల కోరు చీఫ్ రేపు మళ్లీ అబద్దాల మేని ఫెస్టోతో ముందుకు వస్తున్నాడు.

స్వేచ్ఛ పూర్తిగా నశించింది: జనసేన ప్రధాన కార్యదర్శి. టి. శివ శంకర్
అరాచక పాలన అంతం కూటమి పంతం. 98శాతం మేని ఫెస్టో అమలు చేసి మీ ముందుకు వస్తున్నానని జగన్ రెడ్డి అబద్దాల పర్వానికి తెరతీశాడు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే ఎంతో అద్భతం సృష్టిస్తానని చెప్పిన దానికే నేడు ప్రజలు అనుభవిస్తున్నారు. మళ్లీ ఇంకోసారి ఆ అబద్దాల ట్రాప్ లో ఏపీ ప్రజలు పడకూడదనే నేడు కూటమి ప్రజలు ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. జగన్ పాలనలో స్వేచ్ఛ పూర్తిగా నశించింది. సమానవత్వం దహించింది. రాజ్యంగ ఉల్లంఘన, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసిన ప్రభుత్వం జగన్ రెడ్డిది. 130 సార్లు బటన్ నొక్కాను 2లక్షల 75 కోట్లు మీ ఖాతాలో వేశానని చెప్పి సుమారు 13 లక్షల కోట్లు అప్పు చేసి ఒక్క వ్యక్తిపై 3 లక్షల అప్పు భారం మోపాడు. ల్యాండ్, శ్యాండ్, మైన్ అంతా దోపిడీకి గురైంది. గత ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకు వస్తే ఇసుకలోనూ కూడా అవినీతి పాల్పడిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానిదే. .

ఒక సిండికేట్ పాలన : బీజేపీ రాష్ట్ర ఎన్నికల సమన్వయ కర్త పేరాలశేఖర్ రావు
గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి ప్రభుత్వం అవినీతి అసమర్థత, దుర్మార్గానికి ప్రతిబింభంగా నడిచింది. జగన్ రెడ్డి పాలనలో ఒక సిండికేట్ పాలననడిచింది. సిండికేట్ రాజ్యంగా మార్చి లక్షల కోట్ల దోపిడీకి జగన్ రెడ్డి పాల్పడ్డారు, ఇసుకు, మట్టి, గంజాయి, రేషన్ బియ్యం తో అనేక రకాలుగా దోచుకున్నారు. జగన్ అవినీతికి అంతులేదు.పేదలు దళితులపై దాడులకు హద్దు లేదు. కేంద్రం ఎన్నో రకాలుగా సహకరించినా… రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ లేదు. పేదలక కనీస మౌలిక వసతులు కల్పించలేదు. పేదల సమగ్రాభివృద్ధికి పాటుబడలేదు. అందుకే జగన్ రెడ్డి అరాచకాలపై ఛార్జ్ షీట్ తెచ్చాం… దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం… ప్రజలు దాన్ని గమనించి వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలి.

సంకల్ప పత్రాన్ని విశ్వాస ఘాతుక పత్రంగా మార్చారు : బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్
జగన్ రెడ్డి తన సంకల్ప పత్రాన్ని విశ్వాస ఘాతుక పత్రంగా మార్చారు. 99 శాతం హామీలను పూర్తి చేశానని ప్రజలను మభ్య పెడుతున్నాడు. మేని ఫెస్టోను విడుదలు చేస్తూ ఎవరైతే మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అమలు చేయకపోతే కలర్ పట్టుకుని అడగాలని… ఒక వేల నేను గనక పూర్తి చేయకపోతే నాకు ఓటు వేయవద్దని చెప్పిన పెద్దమనిషి జగన్ రెడ్డి. జగన్ రెడ్డి పాలన పారదర్శక. ఆర్థిక ఉగ్రవాదం, చెల్లించిన బిల్లులు ఎటు వెళ్లినవో తెలియని పరిస్థితి ఉంది ఏఏ జీవోలు దేనికి విడుదల చేశారో తెలియదు. రాష్ట్రాన్ని గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మర్చారు. ల్యాండ్, శ్యాండ్, వైన్ మాఫియాకు కేరాఫ్ గా మార్చారు. విచ్చల విడిగా రాష్ట్రాన్ని దోచుకున్నారు. నాసిరకమైన మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. దీనికి జగన్ రెడ్డి ఏ చొక్కా కాలర్ పట్టుకుని అడగాలి.

అమరావతే రాజధాని అని స్పష్టంగా చెప్పాడు కలాట ఆడి ప్రాంతాల మధ్య వధ్వేషం రెచ్చగొట్టాడు. 2021 డిసెంబర్ లోపు పోలవరాన్ని పూర్తి చేస్తానని మాటతప్పాడు. పేదలకు దక్కాల్సిన బియ్యాన్ని పందికొక్కులు మెక్కినట్లు మెక్కారు.

పెదలకివ్వాల్సిన బియ్యాన్ని విదేశాలకు తరలించారు. 30 లక్షల ఇళ్లు పూర్తి చేసి తాళాలు మీ చేతుల్లో పెడతానని చెప్పి మోసం చేశారు. గత ప్రభుత్వం పూర్తి చేసిన పాతిక లక్షల ఇళ్లను ఈ రోజుటికి ఇవ్వలేదు. జల్ జీవన్ కింద నిధులిస్తే ఆ నిధుల్ని డైవర్ట్ చేశారు. రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం తప్ప మరొకటి లేదు.

99 శాతం కాదు కదా.. 15 నుంచి 20 శాతం హామీలు కూడా అమలు చేయలేదు. ఏ విధంగా నమ్మకద్రోహం చేశావో ప్రజలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రజలు కూడా గమనించాలి. అబద్ధాలతో, అసంబద్ధ వాగ్దానాలతో అలవిగాని హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశారు. రాబోయే రోజుల్లో త్రిమూర్తుల్లాగ మూడు పార్టీలు మీ ముందుకు వస్తున్నాయి. రథ చక్రాల్లా ఢిల్లీలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలతో అభివృద్ధి తోటి ముందుకు తీసుకెళ్తారు. జగన్ కు బుద్ధొచ్చేలా ప్రజల నిర్ణయం ఉండాలని ఈ ఛార్జిషీట్ విడుదల చేయడం జరిగింది.

750 వాగ్దానాలు చేశాడు : అధికార ప్రతినిధి పి. గౌతమ్ (జనసేన)
జగన్ హిట్లర్ కన్నా మించిపోయాడు. ప్రబగండం ప్రాపకం చేసే వ్యక్తి గ్లోబెల్ లా జగన్ ప్రవర్తించాడు. ఓడిపోతున్న విషయం తెలిసి కూడా గెలుస్తున్నామని ప్రజల్ని నమ్మించడమే ఆయన పని, జగన్ పని. ముఖ్యమంత్రికి ఏ మంత్రులతో పని లేదు. ఆయనకు ఆయనే గ్లోబెల్ ప్రచారం చేస్తుంటాడు. నేను 99 శాతం వాగ్దానాలు నెరవేర్చానని గ్లోబెల్ ప్రచారం చేసుకుంటుంటాడు. నేను సక్సెస్ అయ్యానని అందరితో చెప్పుక తిరుగుతుంటాడు. ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చానని డప్పు కొట్టుకుంటున్నాడు. జగన్ పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి అధికారంలోకి వచ్చే వరకు 750 వాగ్దానాలు చేశాడు.

ప్రతి నియోజకవర్గంలో నడిచిన ప్రతి చోట వాగ్దానాలు చేస్తూ వచ్చాడు. కనీసం 20 శాతం కూడా పూర్తి చేయలేదు. ఈ విషయం సాక్ష్యాధారాలతో సహా ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి ప్రజా కోర్టులో ఎన్డీయే ఛార్జి షీట్ ని ప్రజల ముందుకు తెస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన అన్యాయాలను రాష్ట్రంలో గుర్తు పెట్టుకోవాలి. సబ్ ప్లాన్ నిధులు లక్ష కోట్లను ముఖ్యమంత్రి దారి మళ్లించారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి నమ్మబలుకుతున్నారు. అందరూ కలిసి జగన్ చెంప ఛెళ్లుమనిపించి ఇంటికి పంపుతారు

LEAVE A RESPONSE