Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసయాదవ్

– ఉత్తర్వులిచ్చిన పార్టీ అధినేత బాబు
– ముందే చెప్పిన ‘సూర్య’

టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసయాదవ్ నియమితులయ్యారు. ఆ మేరకు పార్టీ అధినేత-సీఎం చంద్రబాబునాయుడు ఉత్తర్వు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాసయాదవ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కాగా నిన్నటి వరకూ పార్టీ అధ్యక్షుడిగా కృషి చేసిన అచ్చెన్నాయుడు సేవలను చంద్రబాబు అభినందించారు. ఇదిలాఉండగా.. పల్లాకు పార్టీ పగ్గాలు ఇచ్చారంటూ ‘సూర్య’లో ఈనెల 15న వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే.

LEAVE A RESPONSE