పిల్లలను సంస్కార హీనులను చేస్తున్న తల్లిదండ్రులు

మాయకు మోహానికి దూరమైన, తన సాత్విక చూపుతో సమస్యలు పరిష్కరించే అవకాశం చేతులారా వదులుకుని, తన భర్తకు పిల్లలకు సన్మార్గ త్రోవకై జ్ఞాన బోధ చెయ్యకుండా, తనకు తానుగా, కనిపించే కళ్ళకు గంతలు కట్టుకుంది, గాంధారి మాత.
ఒక విధముగా భర్త కోసం త్యాగమైనా, ఇంకో విధముగా అది పిల్లల పెంపక సంస్కారము కు ఒక శాపము. మహాభారతం లోని ప్రతి పాత్ర, మన చుట్టూ ఖచ్చితం గా ఉంటుంది.
అలాంటి వారిని ఇప్పుడు, దాదాపు మనము ప్రతి ఇంట్లోనూ చూడవచ్చు, ప్రాపంచిక మోహం లో, సినిమా సీరియళ్ళ మత్తులో, సంపాదన మత్తులో, పిల్లల పెంపకాన్ని సంస్కార బోధనను గాలికి వదిలేస్తారు.
ఈ రోజు కూడా టీవీ వార్తలలో, 2 ఏళ్ళు మా పిల్లలను ఊరకే పాస్ చేయించి, ఇప్పుడు ఎందుకు పాస్ చెయ్యరు, అన్న ధర్మ సందేహాన్ని బల్ల గుద్ది అడుగుతున్నారు.
అసలు తమ పిల్లలు ఏమి చదువుతున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, ఏమి సావాసాలో, రోజూ పట్టించుకునే ఓపిక లేదు. ఎన్నో దుర్వార్తలు రోజూ పేపర్లో చూస్తున్నాము.
చదువు సంధ్య బాగున్నా, వారి విపరీత అలవాట్లు, వారిని పతనం చేస్తున్నాయి. ఉద్యోగ సంపాదనలో కూడా, మానసిక బలహీనలతో పతనం అవుతున్నారు.
100 పిల్లల పెంపకం దాసీల చేతి లో పెట్టి, వారి పెంపక బాధ్యతలు వదిలి పెట్టి, తన చుట్టు సమస్యల వలయాన్ని చీకటి ప్రపంచాన్ని స్రృష్టించుకుంది మరియు పెంచుకుంది, తమ వంశ నిర్మూలనకు మొదటి కారణం అయ్యింది, గాంధారి మాత, మహాభారతం గాధ లో.
అంతర్వీక్షణంతో భగవంతునితో మమేక మవ్వగలమని తెలిసి కూడా, మనం భౌతిక ప్రపంచంతో పరుగులు పెట్టడమే, ధ్రుతరాష్ట్ర/ గాంధారి సిండ్రోమ్ అనవచ్చునేమో.
చిత్రం ఏమిటి అంటే, ఆమే అవసరానికి క్రిష్ణుని (మంచిని) గౌరవిస్తుంది, అలాగే తనకే ఇబ్బంది కలిగినప్పుడు క్రిష్ణుని (మంచిని) ద్వేషిస్తుంది కూడా, వాస్తవానికి మరియు దేవునికి దూరంగా ఉంటుంది. మరలా మనం ఆ మాట అంటే ఒప్పుకోరు. సేం మన లాగనే సుమా, అవసరాన్ని అవకాశాన్ని బట్టి మంచి చెడు.
తమ పిల్లలు పాండవుల మీద ద్వేషం పెంచుకున్నారని, మందు పెట్టి భీముని చంపి నదిలో పడవేసారని తెలిసికూడా, చిన్న పిల్లల ఆటగా కొట్టిపారేసారు అంతే గాని, పిల్లలను మందలించలేదు.
దాదాపు గా ప్రతి ఇంట్లో అలాంటి గాంధారి మాతలు ఎందరో? ధ్రుతరాష్ట్రులు ఎటూ తప్పక ఉంటారు.
వీరికి ఎవరు కనువిప్పు కలిగిస్తారు? ఎప్పుడు కనువిప్పు కలుగుతుంది?
వీరికి కనువిప్పు అసలు కలుగుతుందా, జీవితం పూర్తిగా నష్టపోయినదాకా? ముసలి వయసులో అయినా?
ఎందుకంటే, భారత గాధలో, ఆఖరికి మొత్తము సంతానాన్ని కోల్పోయాక కూడా, తమ పెంపక తప్పు తెలుసు కోకుండా, తమ సంతనం అరాచకాలు అంగీకరించక, తమ సంతానాన్ని పాండవులు ఉట్టి పుణ్యానికే అన్యాయముగా చంపారు అన్న భ్రమలో, ఇంకా అరాచకాలకు పాల్పడ్డారు.
దుర్యోధనుని చంపిన భీముని, ప్రేమగా ఆప్యాయత గా పిలిచి, తన బాహువులలో బంధించి చంపుదాము అనుకున్నాడు ద్రుతరాష్ట్రుడు.
కానీ కృష్ణుడు, ఆ పన్నాగాన్ని కనిపెట్టి, బొమ్మను భీముని లా, తన ముందు నిలబెట్టాడు. తన కోపముతో, బొమ్మ అని కూడా గ్రహించకుండా, ముక్కలు ముక్కలు చేసాడు ద్రుతరాష్ట్రుడు.
అలాగే గాంధారి అదే కోపముతో, క్రిష్ణుని అలాగే అతని వంశాన్ని నాశనము కమ్మని శపించింది. క్రిష్ణుడు ఆనందము గా ఆ శాపాన్ని స్వీకరించి కూడా, తనకు జ్ఞానోదయాన్ని కల్గించాడు. అత్తా, మీ సంతన పతనానికి మొదటి కారణము మీ ఇద్దరే, అనవసరము గా ఇతరులను నిందించవద్దు అని.
పిల్లల/ తనయుల సంస్కార పతనానికి మొదటి కారణం, సొంత తల్లి దండ్రులే. మనము నేర్పని క్రుతజ్ఞత, బాద్యత, విశ్వసనీయత, గౌరవం, పెద్దల మాట వినడం, వారికి తెలీదు. మనం మన అమ్మా నాన్న ను దగ్గర ఉంచి చూస్తే, పిల్లలూ అది నేర్చుకుంటారు.
పెళ్ళి అయ్యాక వారు చెడిపోయారు అని తల్లి దండ్రులు అనుకుంటే, దూరముగా ఉండాలి, వారిని ఎడంగా ఉంచాలి. లేదూ వారితోనే తిరుగుతూ, వారు తప్పుడు వారని, వారు గాలికి వదిలారు క్రుతజ్ఞతలు లేకుండా, అంటే నష్టపోయేది, తల్లి దండ్రులే కదా?
మనం బంధాలు అని నాటకాలు ఆడినా, వారు మొహమాటము లేకుండా, ఎటూ అనాధాశ్రమం లోనే లేదా ఇంట్లో నే వంటరిగా వదలుతారు కదా? వారికి లేని బంధం మనకు ఉపయోగమా? ఉపయోగం అయితే, తల్లి దండ్రుల ఆర్తనాదాలు ఎందుకు అనాధలుగా?

– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిల భారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు

Leave a Reply