Suryaa.co.in

Andhra Pradesh

పేదలకు పండగ పూటా పస్తులే

బహిరంగ మార్కెట్లో ధరల బాదుడు
రేషన్ షాపుల్లో పప్పు, పంచధార దూరం
పేదల్ని పస్తులుంచి ప్యాలెస్‌లో ఎంజాయ్ చేస్తున్న జగన్ రెడ్డి
– మాజీ మంత్రి పరిటాల సునీత

పండుగ నాడు పిండి వంటలు, కొత్తబట్టలతో కళకళలాడాల్సిన గ్రామాలు జగనాసురుడి దుర్మార్గాలతో నిస్తేజంగా తయారయ్యాయి. పెరిగిన ధరలు పేదలు పండగ చేసుకోవాలంటే బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు వణికిస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణపై గానీ, పేదలకు సబ్సిడీపై అందించే విషయంపై గానీ కనీసం దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

చివరికి రేషన్ షాపుల్లో బియ్యం తప్ప ఇంకేమీ ఇవ్వకుండా కోత పెట్టారు. పప్పు, పంచధార, గోధుమలు/గోధుమ పిండి, వంటనూనె లాంటి అన్ని సరుకులకూ కోత పెట్టారు. గతంలో రేషన్ షాపుల్లో 8 రకాల సరుకులిచ్చి పేదలకు అండగా నిలిచాం. నేడు నిత్యావసరాలపై నియంత్రణ లేదు. రేషన్ షాపుల్లో ఏకంగా సరుకులే లేవు. ఒకవైపు ఉపాధి దూరం చేసి, మరోవైపు నిత్యావసరాల ధరల మోత మోగిస్తూ పేదల్ని దగా చేశారు. కడుపు నింపుకోవాలంటే ప్రజలు వలసలు వెళ్లాల్సిన దుస్థితి కల్పించారు. ధరలు దిగిరావాలంటే.. జగన్ రెడ్డి దిగిపోవాలని రాష్ట్రమంతా నినదిస్తోంది.

LEAVE A RESPONSE