Suryaa.co.in

Andhra Pradesh

బాబుకు మద్దతుగా పార్టీ సిబ్బంది మేము సైతం…

తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా.. గాంధీ జయంతి రోజున పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ నిరసన దీక్షలు నిర్వహించారు. రాజమండ్రిలో బాబు భార్య భువనేశ్వరి.. ఢిల్లీలో పార్టీ యువనేత లోకేష్ దీక్ష చేయగా, హైదరాబాద్ పార్టీ ఆఫీసులో బాలకృష్ణ భార్య వసుంధర, దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని దీక్ష నిర్వహించారు. అయితే చంద్రబాబుకు దన్నుగా మేము సైతం అంటూ మంగళగిరి పార్టీ ఆఫీసు సిబ్బంది కూడా నిరసన దీక్ష నిర్వహించడం విశేషం. కొన్ని దశాబ్దాల నుంచి పార్టీ ఆఫీసులో చిత్తశుద్ధితో పనిచేస్తున్న సిబ్బంది, సాయంత్రం వరకూ నిరసన దీక్ష నిర్వహించి, పార్టీ అధినేత చంద్రబాబు పట్ల తమకున్న అభిమానం చాటుకున్నారు.

వర్ల కుటుంబసభ్యుల నిరసన దీక్ష

బాబు అరెస్టును ఖండిస్తూ గాంధీజయంతి రోజున నిర్వహించిన దీక్షలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కుటుంబం మొత్తం పాల్గొనడం విశేషం. రామయ్య సతీమణి తన మనుమడిని ఒళ్లో కూర్చుబెట్టుకుని, దీక్షలో పాల్గొన్నారు. ఆయన సతీమణి, పిల్లలు, మనుమలు నిరసన దీక్ష నిర్వహించారు.

LEAVE A RESPONSE