-షూటింగ్ ల గ్యాప్ లో ట్వీట్ లు చేస్తాడు
-సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్ ను వ్యతిరేకిస్తున్నారు
-రాష్ట్రంలో ఏ అలయంలో కూడా టిక్కెట్ ధరలు పెంచలేదు
-ధార్మిక పరిషత్తు ద్వారా 5 ఆలయాలకు పాలక వర్గాల నియామకం
-డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ
అమరావతి: 25 లక్షల నుంచి కోటి రూపాయల ఆదాయం ఉన్న ఆలయాలకు పాలక మండళ్లు నియమించాం.రాష్ట్రంలోని మఠం లకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాం.ఆలయాల్లో పని చేసే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం 20 వేలు వచ్చేలా చర్యలు.స్వరూపానంద ఉద్యోగులు గొడవలు పడవద్దని చెప్పారు.
ఉద్యోగులు కోర్టులకు వెళ్లడం వల్ల ప్రమోషన్ లు ఆగిపోతున్నాయని స్వరూపానందేంద్ర అన్నారు. రాష్ట్రంలో ఏ అలయంలో కూడా టిక్కెట్ ధరలు పెంచలేదు.పవన్ ట్వీట్ ల ద్వారానే ప్రజలతో ఉన్నాను అనుకుంటాడుషూటింగ్ ల గ్యాప్ లో ఇలాంటి ట్వీట్ లు చేస్తాడుపవన్ కు రాజకీయ విలువలు లేవు. చంద్రబాబు ను నిలబెట్టుకోవాలని పవన్ తాపత్రయ పడుతున్నాడు.
మా సామాజిక వర్గం వ్యక్తి ఇలా చేయడం చాలా బాధగా ఉంది.సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్ ను వ్యతిరేకిస్తున్నారు.సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలంతా నమ్ముతున్నారు.లోపాయకారి ఒప్పందాలు చేసుకుని వెళ్తే పెద్ద ప్రభావం ఉండదు.పాదయాత్ర లో టీడీపీ నాయకులు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు. 600 మందితో యాత్ర చేయమంటే టీడీపీ వాళ్ళు ఎందుకు పాల్గొంటున్నారు?
టీడీపీ వాళ్ళు పాల్గొంటున్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తున్నాం.