Suryaa.co.in

Andhra Pradesh

శరవేగంగా సాగుతున్న పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు

భారీ వరదలు పోటెత్తుతున్నా శరవేగంగా సాగుతున్న పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు.ఇటీవలే ప్రారంభమైన పోలవరం జలవిద్యుత్ కేంద్రం ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు.జలవిద్యుత్ కేంద్రంలో


మొత్తం 12 ప్రెజర్ టన్నెల్స్.ఒక్కో టన్నెల్ పొడవు 150.3మీ. వెడల్పు 9మీ.అతి తక్కువ కాలంలోనే రెండవ టన్నెల్ తవ్వకం పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్ద.చురుకుగా సాగుతున్న మిగతా టన్నెల్స్

తవ్వకం పనులు.ఇప్పటికే 2139639 క్యూబిక్ మీటర్ల కొండతవ్వకం పనులు పూర్తి చేసిన మేఘా.పోలవరం జలవిద్యుత్ కేంద్రం కొండ తవ్వకం పనులు దాదాపు పూర్తి.జలవిద్యుత్ కేంద్రంలో 12వెర్టికల్ కల్పన్

టర్బైన్ ,ఒక్కో టర్బైన్ కెపాసిటీ 80 మెగా వాట్లు.అదేవిధంగా 12 ప్రెజర్ టన్నెల్,వీటికి 12జనరేటర్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి.ఒక్కో ట్రాన్స్ఫార్మర్ 100మెగా వాట్ల కెపాసిటీ తో ఉంటుంది.టన్నెల్ తవ్వకం

పనులను దగ్గరుండి పర్యవేక్షించిన జెన్కో ఎస్ ఈ: ఎస్ శేషారెడ్డి,ఈ ఈ లు ఏ.సోమయ్య,సి.హనుమ, మేఘా ఇంజనీరింగ్ సంస్ద వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జిఎం ముద్దుకృష్ణ, ఎజిఎం క్రాంతికుమార్,రాజేష్

కుమార్,మేనేజర్ మురళి తదితరులు.

LEAVE A RESPONSE