కంతేరు ఘటనపై డీఐజీ త్రివిక్రమ్ వర్మ మాటలు బూటకం

– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు

కంతేరు ఘటనపై డీఐజీ త్రివిక్రమ వర్మ చేసిన వ్యాఖ్యలు బూటకమని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు విమర్శించారు. పోలీసులు బాధితులను హింసిస్తూ రౌడీలను కాపాడుతున్నారన్నారు. మాణిక్యరావు ఏమన్నారంటే…
నిందితులపై కేసులు పెట్టకుండా ఇరువర్గాలపై కేసులు నమోదు చేసాం అనడం వైసీపీ రౌడీలను కాపాడటానికే.ఒంటరి, దళిత మహిళ వెంకాయమ్మను చంపాలని చూస్తున్న వైసీపీ.దళిత మహిళ వెంకాయమ్మపై ఇప్పటికే 2 సార్లు దాడి చేసిన వైసీపీ రౌడీ మూకలు.

-బాధితులను హింసిస్తూ, రౌడీలను కాపాడుతున్న పోలీసులు. దళితులపై పోలీసుల తీరు.. పోలీసుల వ్యవస్థకే సిగ్గు చేటు.నిన్న తాడికొండ పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందే వెంకాయమ్మను, వాళ్ళ కొడుకును చావా బాదిన వైసీపీ రౌడీమూకలు. తాడికొండ పోలీస్ స్టేషన్లో దళిత మహిళ వెంకాయమ్మ, మరో దళితుడు శివాజీ తదితరులపై అనేక సార్లు దాడులు జరిగినప్పటికీ కేసులు నమోదు చేయని పోలీసులు.

నిందితులతో కలిసి బాధితులను ఛేదిస్తున్న పోలీసులు.నిన్న సాయంత్రం టీడీపీ ప్రతినిధుల బృందంతో వెల్లడైన తాడికొండ పోలీసుల ఆకృత్యాలు.వీటిపై స్పందించిన SP, కేసు కడతామని హామీ ఇచ్చి, నిందితులను ఈ రోజు వరకు ఆరెస్ట్ చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని కూల్చి వేస్తూ, తెలుగుదేశం పార్టీ నాయకులను ఇళ్లలో నుంచి రానివ్వకుండా ఆరెస్ట్ చేయటం, వైసీపీ రౌడీ మూకలకు పోలీసులు సలాం చేస్తున్నారా.. అనడానికి పోలిసుల చర్యలే నిదర్శనం.

దళిత మహిళ వెంకాయమ్మను, వాళ్ళ కొడుకును హతమార్చడానికి వైసీపీ రౌడీలు, పోలీసులు పక్క వ్యూహం రచించినట్లు అర్థమౌతుంది.వైసీపీతో కలిసి పోలీసులు చేస్తున్న కుట్రలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.

Leave a Reply