భారీ చోరీని ఛేదించిన పోలీసులు

శ్రీకాకుళం : ఇచ్చాపురం చక్రపాణి వీధిలో వ్యాపారి రామిరెడ్డి ఇంట్లో ఎవరులేని సమయంలో గత నెల 26న ఇంట్లో 39 తులాల బంగారు, 34 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దినేని తిరుపతి, నెల్లూరు జిల్లాకు చెందిన గుంటుపల్లి తిరుపతిరావు,వెంకరమనయ్య, విశాఖకు చెందిన భవిరిశెట్టి శ్రీనివాసరావులను అరెస్టు చేసి వారివద్ద నుంచి చోరీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply