ఈనెల 21న ఖమ్మం టిడిపి సభపై సన్నాహక సమావేశం

-ఖమ్మం సభపై టిడిపి నేతలతో కాసాని సమీక్ష
-హాజరైన రావుల, కంభంపాటి, ఖమ్మం టిడిపి నేతలు
-ఖమ్మం సభ తెలుగుదేశం పునరుత్తేజానికి నాంది 
-తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణలో టిడిపి పూర్వ వైభవానికి ఖమ్మం నుండే శ్రీకారం.21న చంద్రబాబు ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలి. లక్షమంది పైగా జనం ఖమ్మం సభకు తరలిరానున్నారు. అందుకు తగ్గరీతిలో ఏర్పాట్లు చేయాలన్న కాసాని. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. ఇటీవల భారీవరదల్లో రైతులు, చేతివృత్తులవారికి తీవ్ర నష్టం.చంద్రబాబు హయాంలో నిర్మించిన కరకట్టే భద్రాచలాన్ని కాపాడింది. కరకట్ట పూర్తిచేయడంలో తర్వాత పాలకులు విఫలం అయ్యారు. టిడిపి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ విజయవంతం చేయాలి. ‘‘ఇంటింటికి తెలుగుదేశం’’ కరపత్రాలు పంపిణీ చేయాలి. ఖమ్మం సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలి. జనం గుండెల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని తట్టిలేపాలి.

Leave a Reply