మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడిపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. సీఎం జగన్పై తీవ్ర పదజాలంతో దాడి చేశారు. లోకేష్ ఏమన్నారంటే…
ఇప్పటివరకూ ముఖ్యమంత్రి అని గౌరవించి గారూ అనేవాడిని. నీ వికృత, క్రూర బుద్ధి చూశాక సైకో, శాడిస్ట్, డ్రగ్గిస్ట్ జగన్రెడ్డి అని అంటున్నాను. నువ్వూ, నీ బినామీలు డ్రగ్స్ బిజినెస్ చేస్తారు. నిలదీసే టిడిపి నేతలపై దాడులకు పాల్పడతావా? పరిపాలించమని ప్రజలు అధికారం అందిస్తే… పోలీసుల అండతో మాఫియా సామ్రాజ్యం నడుపుతావా? టిడిపి కేంద్రకార్యాలయాలపై గూండా మూకలతో దాడులకు తెగబడతావా? ఎన్నాళ్లిలా ఇంట్లో దాక్కుని నీ కుక్కలతో దాడులు చేయిస్తావు! నువ్వే రా తేల్చుకుందాం.
తెలుగుదేశం సహనం చేతకానితనం అనుకుంటున్నావా? నీ పతనానికి ఒక్కో ఇటుకా నువ్వే పేర్చుకుంటున్నావు. నిన్ను ఉరికించి కొట్టడానికి తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరంలేదు. నీ అరాచకాలపై ఆగ్రహంగా వున్న కేడర్కి మా లీడర్ కనుసైగ చేస్తే చాలు. నీ కార్యాలయాల విధ్వంసం నిమిషం పని. నీ ఫ్యాన్ రెక్కలు మడిచి విరిచి నీ పెయిడ్ ఆర్టిస్టుల్ని రాష్ట్రం దాటేంతవరకూ తరిమి కొడతారు మా కార్యకర్తలు. అన్ని ఆనవాయితీలని బ్రేక్ చేసి, ప్రజాస్వామ్యానికి పాతరేసి..నీ సమాధికి నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు కోడికత్తిగా.