– యువగళం పాదయాత్ర నుండి నారా లోకేష్
సీమప్రజలకు గుక్కెడు నీళ్లివ్వడం చేతగాని జగన్ రెడ్డి గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన పథకాలకు మాత్రం సిగ్గులేకుండా స్టిక్కర్లు, రంగులు వేసుకుంటున్నాడు. ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇబ్రహీంపురంలో ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద గత ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటుచేసింది. ఈ పథకానికి నీరు అందించడం చేతగాక పాడుబెట్టిన వైసిపి నేతలు జలగన్న స్టిక్కర్ మాత్రం వేసుకున్నారు. ఎవరికో పుట్టిన బిడ్డలను తమ బిడ్డలని చెప్పుకోవడం అలవాటుగా మారిన సైకో బ్యాచ్ ఖాళీ ఖజనాతో చేయగలిగింది ఏముంది? ఇంతకుమించి మేం పీకేదేం లేదని ఆ స్టిక్కర్లు మీ మొఖాలకు వేసుకుంటే ఇంకా బాగుండేదేమో!!