– తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా శంఖారావం
-బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్: వరంగల్ వచ్చే ధైర్యం లేక రాహుల్ గాంధీ పారిపోయారు. హామీలపై ప్రజలు నిలదీస్తారనే రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అదే వరంగల్ లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ అమలే కాలేదు.వరంగల్ డిక్లరేషన్ పై రైతులు ప్రశ్నిస్తారని రాహుల్ గాంధీ భయపడ్డారు.
ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ఊరుకోబోరు.మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎక్కడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది.ఇక్కడి కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదని ఎన్నికలప్పుడు ఢిల్లీ నుంచి నాయకులను తీసుకొచ్చారు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ వచ్చి చిలుక పలుకులు పలికారు. రేవంత్ రెడ్డి ముఖం కాదు… సోనియా, ప్రియాంకా, రాహుల్ గాంధీల ముఖం చూసి మహిళలు కొంత వరకు ఓట్లు వేశారు.
అధికారంలోకి వచ్చి 14 నెలలు అయినా మహిళలకు 2500 ఇవ్వడం లేదు రేవంత్ రెడ్డి మహిళలకు రూ 35 వేల చొప్పున బాకీ పడ్డారు.. రూ. 35 వేలను ప్రతీ మహిళా బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మార్చి 8న మహిళా శంఖారావం.రాష్ట్రంలో మహిళలకు భద్రత లేని పరిస్థితి.
రేవంత్ రెడ్డి పాలనలో క్రైమ్ రేటు 20 శాతం పెరిగింది. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. శివారు ప్రాంతాల్లోని ఇళ్లలో దొంగలు చెలరేగుతున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క మతకల్లోలం జరగలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాకా ఎక్కడో ఒక చోట తరుచూ మతకల్లోలాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీటీవీల్లో 70 శాతం పనిచేయడం లేదు.
భద్రత కోసం కూడా మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరం.18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశారు. కేసీఆర్ పై అక్కసుతో కేసీఆర్ కిట్ లను నిలిపివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ ఆస్పత్రులపై శ్రద్ధ పెట్టాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి బస్సుల సంఖ్యను తగ్గించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ను 4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తక్షణమే దాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.