రాహుల్ బహిష్కరణ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం పై కుట్ర

బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడి
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి బహిష్కరణ వేటు వేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు.2 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురిచేసింది.బహిష్కరణ వేటు ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్న.రాహుల్ బహిష్కరణ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామ్యవాదం పైన జరుగుతున్న కుట్రగా చూడాలి.

రాహుల్ గాంధీ గారి పై తప్పుడు కేసులు పెట్టి సూరత్ కోర్టులో శిక్ష వేయించి న్యాయవ్యవస్థను పక్కదారి పట్టించిన బిజెపి ఫాసిస్టు ప్రభుత్వం.మతతత్వ ఫాసిస్టు బిజెపి ప్రభుత్వం చేస్తున్న ఈ దాడిని ఖండిస్తున్న.సామ్యవాదులు, లౌకికవాదులు, ప్రగతిశీలవాదులు, ప్రజల సంపద ప్రజలకే చెందాలని కోరుకునే వాళ్ళు రాహుల్ గాంధీ బహిష్కరణ వేటును ముక్తకంఠంతో ఖండించాలి. రాహుల్ గాంధీ వెన్నంటి కోట్లాదిమంది ఉన్నారని మోడీ సర్కార్ గ్రహించాలి.ఈ దేశం లౌకికవాదం తో ముందుకెళ్లాలని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన అసలు సిసలైన ప్రజాస్వామిక వాది రాహుల్ గాంధీ పై కేసు పెట్టి, జైలుకు పంపాలని మోడీ అమిత్ షా చేసే కుట్రల బెదిరింపులకు రాహుల్ లొంగడు.

తీవ్రవాదుల చేతుల్లో దేశం విచ్చినం కాకుండా దేశ ఔన్నత్యం, సమైక్యత, సమగ్రత కోసం ఖలిస్తాన్ ఉగ్రవాదుల తుపాకీ తూట్ల వర్షానికి ప్రాణాలర్పించిన ఇందిరా గాంధీ రక్తం రాహుల్ లో ప్రవహిస్తున్నది. దేశ సార్వభౌమత్వానికి ఎల్టిటిఈ తీవ్రవాదులతో పొంచి ఉన్న ముప్పును వ్యతిరేకించి మానవ బాంబుకు ముద్దైన రాజీవ్ గాంధీ రక్తం రాహుల్ గాంధీలో ప్రవహిస్తున్నది.దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీ వారసుడు మోడీ అమిత్ షా బెదిరింపులకు భయపడడు. రాహుల్ గాంధీ ని ఎదుర్కోలేక పిరికిపందలైన మోడీ, అమిత్ షా లు తప్పుడు కేసులు పెట్టి, జైలు శిక్ష పడేలాగా చేసి, జైలు శిక్ష పడిందని పార్లమెంటు నుంచి బహిష్కరించేందుకు చేసిన కుట్రలు దేశానికి మాయని మచ్చగా మిగులుతాయి.మోడీ, అమిత్ షా లు నియంతృత్వ పోకడలతో రాహుల్ గాంధీ పై సూరత్ లో పెట్టిన అక్రమ కేసు, విధించిన జైలు శిక్షనే బిజెపిని భూస్థాపితం చేయడానికి నాంది పలుకుతుంది.

Leave a Reply