Suryaa.co.in

Telangana

రామోజీరావు మృతి మీడియా రంగానికి తీరని లోటు

– జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి

తెలుగుతోపాటు దేశంలోని మరెన్నో భాషల్లో మీడియా రంగం ద్వారా ప్రజలకు సేవలు అందించిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతి దేశంలోని మీడియా రంగానికి తీరని లోటు అని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ , భాగ్యనగర్ నగర అధ్యక్షులు అఖిలేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రింట్ తో పాటు ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో కూడా జాతీయస్థాయిలో రామోజీరావు (ఈనాడు) అందించిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ తో పాటు ఇతర రంగాల ద్వారా వేలాది మందిని జర్నలిస్టులుగా తీర్చిదిద్దిన ఘనత రామోజీరావు గారిదే అని ప్రశంసించారు. ఎంతటి విపత్తునైనా ఎదుర్కొని నిక్కచ్చి గల వార్తలతో నిలబడ్డ అసాధ్యుడు రామోజీరావు అన్నారు.

అనేక ఒ ఒడిదుడుకులను ఎదుర్కొని అక్షర సమరంతోనే విజయం సాధించిన మహనీయుడు అని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ఎప్పటికప్పుడు మీడియా రంగంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ..తరతరాలకు చిరస్మరణీయ జర్నలిజం సంబంధించిన ఆ మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.. నివాళి అర్పిస్తున్నామని పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం తెలిపింది.

LEAVE A RESPONSE