Suryaa.co.in

Andhra Pradesh

విచ్చలవిడి డ్రగ్స్, గంజా కారణంగా మహిళలపై పెచ్చురిల్లిన అత్యాచారాలు

– పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షులు వంగలపూడి అనిత

17 ఏళ్ల మైనర్ దళిత బాలిక గ్యాంగ్ రేప్‌కి గురైంది. గతంలో రాజమండ్రిలో ఇదే రకంగా దళిత యువతి అత్యాచారానికి గురైంది. సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో మరో దళిత యువతిని తనకు కాబోయే భర్త ముందే గ్యాంగ్ రేప్ చేశారు. ఈ గ్యాంగ్ రేప్‌లో ముద్దాయిగా ఉన్న వెంకట్ ‌రెడ్డిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు.

రాష్ట్రంలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేని దుస్థితి ఏర్పడింది. గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా లభ్యం కావడం, కల్తీమద్యంతో మతి చెడి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందనే భరోసాతో వైసీపీ అనుకూల రౌడీ గ్యాంగ్‌లు పెచ్చుమీరిపోతున్నాయి. ఫలితంగా రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోని మహిళల మాన ప్రాణాలకు రక్షణ కావాలంటే జగన్ రెడ్డిని సాగనంపాలి. రాష్ట్రంలోని మహిళలంతా అపర కాళికలై జగనాసురుడి పీడ వదిలించుకోవాలి.

LEAVE A RESPONSE