Suryaa.co.in

Telangana

కర్ణాటకలో సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు

కరెంట్ రెండు గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి
రెండు రాష్ట్రాల్లో జనసేనతో కలిసిపోతాం
బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్

కర్ణాటక లో సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు పెడుతున్నారు . కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం వస్తేనే మేలు అని ప్రజలు అభిప్రాయానికి వస్తున్నారు.ఉచిత హామీలతో మోసపోయామని కర్ణాటక ప్రజలు భావిస్తున్నారు.కర్ణాటకలో నాణ్యమైన కరెంట్ రెండు గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. నాడు కర్ణాటకలో బిజెపి ప్రభుత్వంలో 12 గంటల విద్యుత్ ఇచ్చాం.

కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో రైతులకు ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.కరెంట్ చార్జీలు పెంచారు… వెయ్యి రూపాయలు వచ్చే కరెంట్ బిల్లు.. ఇప్పుడు మూడు వేలు వస్తోంది.అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ మాట మార్చింది.కర్ణాటక లో 65 ఏండ్లు దాటిన వారికే వృధ్యాప్య పింఛన్లు ఇస్తున్నారు.చేయూత పథకాల పేరుతో చెయ్యి ఇస్తారు జాగ్రత్త.

తెలంగాణ ప్రజలు BRS, కాంగ్రెస్ హామీలకు మోసపోవద్దు.నవంబరు 7వ తేదీన నరేంద్ర మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతున్నా. జనసేన NDA భాగస్వామి.. జనసేన తో పొత్తు ఖరారు అయ్యింది. రెండు రాష్ట్రాల్లో జనసేనతో కలిసిపోతాం.

LEAVE A RESPONSE