Suryaa.co.in

Features

దళిత నేతలారా మేల్కొనండి

బ్రాహ్మణజాతి మీద ప్రతిసారి రంకెలేసే ఓ దళిత నేతలారా, పెద్ద లారా, మేధావులారా… ప్రస్తుత సమాజంలో పెత్తందార్లుగా వున్న ఈ కులాలపై ఉద్యమం చేయడానికి, మాట్లాడడానికి మటుకు మీకు నోరు అస్సల్ పెగలదే…!! దేనికో…??

దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ పై జరిగిన ఈ అమానుష దాడిని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది.ఈ ఉదంతంలో సమాజంలో వున్న అందరూ ముక్తకంఠంతో యువకుడి మీద దాడి చేసిన.., అమానుషంగా వ్యవహరించిన తీరుపై మాత్రం అందరూ తప్పనిసరిగా ఖండించాల్సిదే. బాధితునికి అండగా ఉండాల్సిందే.

ఇంతకూ అసలేం జరిగిందన్న వాస్తవం విషయంలోకి వెళితే….

ఆంధ్రాలో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లకు చెందిన కాండ్రు శ్యామ్ కుమార్ అనే యువకుడిపై ఆరుగురు కుర్రాళ్లు దాడి చేసిన వైనం.. దాడి సందర్భంగా అతడ్ని హింసించిన ఉదంతంలో షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి. అయితే.. శ్యాం దళిత సామాజిక వర్గాన్ని దూషిస్తూ అతడిపై దాడి చేసిన వారు మటుకు రెడ్డి సామాజిక మదంతో మాత్రమే దాడి చేశారు.

ఇంతకూ ఇంత పెద్ద దాడికి కారణం ఏమిటన్నది చూస్తే.. శ్యామ్ కు అన్న వరస అయ్యే అవినాష్ పంచాయితీగా చెప్పాలి. ఇప్పుడు అతగాడు విదేశాలకు వెళ్లిపోయాడు. అతనికి హరీశ్ రెడ్డి అనే కుర్రాడికి మధ్య ఒక అమ్మాయి విషయంలో గొడవ నడిచింది.

సదరు వివాదంలో కలుగజేసుకన్న శ్యామ్.. వారిద్దరికి అప్పట్లో సర్ది చెప్పాడు. ఇదంతా ఏడాది క్రితం జరిగింది. అప్పట్లో జరిగింది మనసులో పెట్టుకున్న అవినాశ్ ఇటీవల తన స్నేహితులతో కలిసి శ్యామ్ పై దాడికి పాల్పడ్డారు. త్వరలో తాను విదేశాలకు వెళ్లిపోతున్నానని.. చివరిసారి కలుద్దామని శ్యాంను ఫోన్ లో పార్టీకి పిలిచారు. పాత వివాదం సమిసిపోయిందన్న ఉద్దేశంతో అవినాశ్ మాటల్ని నమ్మిన శ్యామ్.. అతడ్ని కలిసేందుకు మరో స్నేహితుడితో కలిసి కంచికచర్ల శివసాయి క్షేత్రం వద్దకు వెళ్లారు.

కారులో అక్కడకు వచ్చిన అవినాశ్.. అతని స్నేహితులు.. శ్యామ్ ను బలవంతంగా కార్లో ఎక్కించారు. అతడి స్నేహితుడ్ని పక్కకు తోసేసి తమతో తీసుకెళ్లారు. నోట్లో గుడ్డలు కుక్కి.. కళ్లకు గంతలుకట్టి.. పరిటాల సమీపానికి వచ్చినంతనే అతడికి వార్నింగ్ ఇస్తూ.. దాడికి పాల్పడ్డారు. తాము పవర్ లో ఉన్నామని.. ఎవరైనా సరే తాము తిట్టినా.. కొట్టినా పడి ఉండాల్సిందేనని.. అతిగా మాట్లాడితే చంపేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.

మాటలతో సరిపెట్టకుండా.. కర్రలు.. ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. కారులో ప్రయాణించినంత సేపు శ్యామ్ పై దాడి చేస్తూనే ఉన్నారు. అన్నింటికంటే దుర్మార్గమైన చర్య ఏమంటే.. గుంటూరు సమీపానికి తీసుకెళ్లి దాడి చేస్తున్నప్పుడు.. దాహం వేస్తుందని అంటే.. కారులో నుంచి దించి.. శ్యామ్ చుట్టూ అవినాశ్ అతడి స్నేహితులు కలిసి అతడి ముఖంపై మూత్రం పోయటం.. అతడి టీషర్టును విప్పించి.. దాంతో తుడవటంలాంటి అనాగరిక చర్యలకు పాల్పడ్డారు.

జరిగిన విషయాలన్ని శ్యామ్ తన ఫిర్యాదులో పోలీసులకు తెలియజేశారు. తాము చేసిన దాడి గురించి కానీ.. తాము అన్న మాటల్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని.. తాము చెప్పిందే ఇప్పుడు నడుస్తుందని.. తమను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరించారు. ఇది జరిగిన అమానుష ఘటన…..

దళిత నేతలారా, సోదరులారా, పెద్దలారా ఆనాడు చుండూరు,కారంచేడు తదితర ప్రాంతాల్లో జరిగిన రక్తక్షేత్ర ఘటనలలో అప్పటి దళిత ఉద్యమ స్ఫూర్తి నేటి తరంలో కొరవడిందనే బాధతో, దళితుని నోట్లో ఉచ్చ పోసినా సరే.. రాజకీయ పార్టీలకు అతీతంగా మన నేతల్లో స్పందన లేదనే ఆవేదనతో….

మన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ పై జరిగిన ఈ అమానుష దాడిని బ్రాహ్మణ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది.

– సిరిపురపు శ్రీధర్ శర్మ
రాష్ట్ర అధ్యక్షులు
బ్రాహ్మణ చైతన్య వేదిక

LEAVE A RESPONSE