-మాజీ మంత్రి హరీష్ రావు
రిటైర్డ్ పోలీసు ఉద్యోగి సాధిక్ అలీ 8 నెలల నుంచి తనకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నానని, ఇక అతహత్యే శరణ్యం అంటూ ఆవేదన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం.
మీ పాలన అన్ని వర్గాలతో పాటు రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా శాపంగా మారింది. విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే రోజుల్లో వారిని మానసిక క్షోభకు గురి చేయడం హేయమైన చర్య.
దాదాపు 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు వారికి హక్కుగా రావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం నిర్లక్ష్యానికి నిదర్శనం. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేని దుస్థితికి విశ్రాంత ఉద్యోగులను నెట్టడం శోచనీయం.
మరోవైపు నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించక ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీసులకు వైద్యం అందించే ఇహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఆరోగ్య భద్రత పథకాలను సేవలను సైతం అటకెక్కించే పరిస్థితి కల్పించారు. అత్యవసర వైద్య సేవలు అందకుండా చేశారు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి వెంటనే బకాయిలు చెల్లించి, ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు వైద్య సేవలు కొనసాగేలా చూడాలని, రిటైర్మెంట్ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న బెన్ఫిట్స్ ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం.
విజయవంతంగా ఉద్యోగాలు పూర్తిచేసి, జీవితంలో విజయం సాధించిన మీ సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావు. పోరాడి పరిష్కారం చేసుకుందాం. మీకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది.