Home » రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణి విడనాడాలి

రేవంత్ రెడ్డి నియంతృత్వ ధోరణి విడనాడాలి

– బిజెపి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి

హైదరాబాద్: నేడు స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థి నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల చేత విచక్షణారహితంగా దాడులు చేయించడం పట్ల బిజెపి రాష్ట్ర శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.

రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్న విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించడం సరైనది కాదు. సమస్యల పరిష్కారం చేయాలని అనేక సందర్భాలలో వినతి పత్రాల రూపంలో ప్రత్యక్షంగా తెలిపినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులు బడుగు బలహీన వర్గాలకు చెందినవారు. మౌలిక వసతులు కల్పించాలని అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు కోరుతున్న విషయం వాస్తవం కాదా?
ఏబీవీపీ విద్యార్థి నాయకులు గాయపడడం జరిగింది. విద్యార్థి నాయకులకు చెప్పుకోలేని విధంగా పోలీసులు గాయం చేశారు.

పోలీసులు విచక్షణారహితంగా బయటకు కనిపించని విధంగా దాడులు చేయడం దుర్మార్గం. బూట్ కాళ్లతో తన్నడం, ఎవ్వరికీ కనిపించకుండా విద్యార్థుల చుట్టూ ముట్టి పిడిగుద్దు లతో గుద్దడం పోలీసులు చేసిన పని. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. నిరసన ప్రదర్శనల పై రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియంతృత్వ, నిరంకుశ ధోరణి విడనాడాలి.

Leave a Reply