Suryaa.co.in

Telangana

రేవంత్ మంచోడు కాబట్టే మీరు ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారు

– కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

హైదరాబాద్: రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే మీరు ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారు. లేకపోతే నిన్నటి నుంచి ఒక లెక్క, ఈరోజు నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉండేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లకు కొన్నాడని కోమటిరెడ్డి చెప్పారంటూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ కు నాయకుడే లేడని, అసెంబ్లీకి రావడమే మానేశారని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ హయాంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ప్రతిపక్షమే లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తమకు నీతులు చెబుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడటం కంటే, ఆ సమయాన్ని ప్రజల కోసం కేటాయిస్తే బాగుంటుందని చెప్పారు.
బీఆర్ఎస్ పాలన అహంకారంతో సాగిందని సభ మీ సొంతమా? అధికారం లేకపోయేసరికి బీఆర్ఎస్ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

LEAVE A RESPONSE