Suryaa.co.in

Andhra Pradesh

రోజా అంటే నీచమైన భాషకు బ్రాండ్ అంబాసిడర్

– మంత్రి రోజాకి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష కౌంటర్

రోజా అంటే నీచమైన భాషకు బ్రాండ్ అంబాసిడర్. రాజకీయాల్లో మహిళలు ఎంతో హుందాగా, ఆదర్శంగా ఉండాలి. కానీ రోజా మాత్రం మహిళా అన్న సంగతి మరిచి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం, టీడీపీ నాయకుల గురించి మీరు మాట్లాడే మాటలు, హావభావాలు చూస్తుంటే సాటి మహిళగా సిగ్గుపడుతున్నాం. జగన్ రెడ్డి ప్రాపకం కోసం, మీకు సీటు కోసం అసభ్యంగా మాట్లాడుతున్నారు.

టీడీపీ 175 స్థానాల్లో పోటీ గురించి రోజా నోరుపారేసుకున్నారు. టీడీపీ అంటే క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా పార్టీలోనే కార్యకర్త నుంచి నాయకుల వరకు హుందాగా ఉండేటట్టు చంద్రబాబు తీర్చిదిద్దుతారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 175 నియోజకవర్గాల్లో గెలుపు సాధించే అభ్యర్ధులతో టీడీపీ సిద్దంగా ఉంది. వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలే భయటకు వెళ్లిపోతున్నారు. జగన్ రెడ్డి భయంతో ఎమ్మెల్యే అభ్యర్ధులను మారుస్తున్నారు. జగన్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉండటంతో రోజా పిచ్చి పట్టిన్నట్లుగా మాట్లాడుతున్నారు.

LEAVE A RESPONSE