Suryaa.co.in

Andhra Pradesh

సుబ్బారెడ్డితో రోజా భేటీ

నగరి ఎమ్మెల్యే రోజా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డితో భేటీ అయ్యారు. తన నియోజకవర్గంలోని వివిధ సమస్యల పరిష్కారం కోసం, ఆమె సుబ్బారెడ్డికి కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు.
నగరి నియోజకర్గంలో ఆలయాల నిర్మాణాలకు టీటీడి ద్వారా ఆర్థిక సహాయం పొందడానికి, తడుకు RS నుంచి అప్పలాయగుంట వరకు రోడ్డు వెడల్పు చేయడానికి, నిండ్ర లోని పురాతన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలని, ముడిపల్లి లోని అతి పురాతన అగస్తీశ్వర స్వామి ఆలయం మరియు కరియ మాణిక్య స్వామి ఆలయాలను దేవస్థానం వారు స్వాధీనం చేసుకోవాలని, నగరి దేశమ్మ ఆలయం నకు దేవాదాయశాఖ కామన్ గూడ్స్ నిధుల ద్వారా మంజూరు అయిన వాటికి టీటీడీ ద్వారా పనులు జరిపించాలని మొదలైన వాటికి వినతిపత్రం సమర్పించారు.ఇతర అభివృద్ధి సంబంధిత ముఖ్యమైన విషయాలను ముఖాముఖి చర్చించారు.

LEAVE A RESPONSE