పెరిక కులస్థులకు బీసీ బంధు
విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్
పెరిక కులస్థులకు సముచిత రాజకీయ అవకాశాలు
గంప గోవర్ధన్ కు త్వరలో ఉన్నత పదవి
మంత్రుల హామీ
కోకపేట: పెరిక కులస్థులపై తెలంగాణ రాష్ట్ర మంత్రులు హామీల జల్లు కురిపించారు. హైదరాబాద్లోని కోకాపేటలో ఆదివారం జరిగిన పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ పనుల శంకుస్థాపన, ఆత్మగౌరవ సభలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ చీఫ్ బోడపుంటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్ గారు పెరిక కులస్థులకు సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వారికి అందజేశారు.
పెరికలతోపాటు అన్ని కులాలకు బీసీ బందు అమలు చేయాలని, కుల సంఘాల ఆధ్వర్యంలో నడిచే హాస్టళ్లకు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని, పెరిక కులస్తులకు మూడు ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ సీటు కేటాయించాలని, పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ లో కులాలవారీగా రిజర్వేషన్లు ఉండాలని, పెరిక కులస్తులను ఎంబీసీ జాబితాలో చేర్చాలని, ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్లు కేటాయించాలని సభ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం సీటు త్యాగం చేసిన గంప గోవర్ధన్ కు మంత్రి పదవి ఇవ్వాలని పెరికస్తులు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కోకాపేటలో నిర్మిస్తున్న పెరిక కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. పెరిక కులస్థులకు బీసీ బంధు అమలు అయ్యేందుకు, పెరిక విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి, కృషి చేస్తామని హామీలు ఇచ్చారు.
పెరిక కులస్థులకు సముచిత రాజకీయ అవకాశాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పిస్తారన్నారు. అలాగే, సీఎం కేసీఆర్ కి తన కామారెడ్డి నియోజకవర్గాన్ని వదులుకున్న గంప గోవర్ధన్ కు భవిష్యత్తులో ఉన్నత పదవి అందుతుందని మంత్రులు తెలిపారు.
పెరిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దాలింగయ్య, భవన నిర్మాణ కమిటీ చైర్మన్ గటిక విజయ్ కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ బోడ కుంటి వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యేలు శ్రీరామ్ భద్రయ్య బండి పుల్లయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ వలిశెట్టి సత్యనారాయణ, అస్సోసియేట్ అధ్యక్షులు సుంకరి ఆనంద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూసాని శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి బందు శ్రీధర్ బాబు, భవన నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కుంచాల శ్రీనివాస్,గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బత్తిని పరమేష్,ఎల్ బి నగర్ అధ్యక్షులు సుందరి వీర భాస్కర్,బోడపుంటి ప్రకాష్, అచ్చా రఘు, దాచేపల్లి రవి తదితరులు పాల్గొన్నారు..