Suryaa.co.in

Telangana

మంత్రుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు

-విధ్వంసం వైపుకు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు
-తెలంగాణ ప్రగతిపై రేవంత్ రెడ్డి విషం
-బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

చేవెళ్ళ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శఠగోపం పెట్టారు. 90 లక్షల రేషన్ కార్డుదారులకు పధకాలు వర్తింప చేయాలి. 40 లక్షల గ్యాస్ కనెక్షన్స్ కు మాత్రమే సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కోటీ ఐదు లక్షల గృహాలకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి. సవాల్ విసిరే అర్హత రేవంత్ రెడ్డికి లేదు. 2018 కొడంగల్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని రేవంత్ రెడ్డి అనలేదా? 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ రెడ్డి అనలేదా?

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించి కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికలకు వెళ్లే సత్తా వుందా? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కదు. తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం వైపుకు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. తెలంగాణ ప్రగతిపై రేవంత్ రెడ్డి విషం కక్కుతున్నారు.

కృష్ణా నదిపై వున్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించినందుకు రేవంత్ రెడ్డిని పొగడాలా 4000 పింఛన్,రైతు రుణమాఫీ ఎటు పోయింది? బూతు పురాణాలు,అబద్ధాల ప్రచారం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ప్రజల దృష్టిని మరల్చే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.

రేవంత్ రెడ్డి ఏ.డీ (అటెన్షన్ డైవెర్షన్ )లా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ,సచివాలయం, మేడారం జాతర ఎక్కడైనా రేవంత్ రెడ్డి భాష ఒకటే విధంగా వుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతామని ఎవరు అన్నారు? కాంగ్రెస్ పార్టీలోనే పది గుంపులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు సీఎంగా ఉండి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

తెలంగాణను బంగారు పళ్ళెంలో పెట్టి రేవంత్రెడ్డి కి అప్పగించాము. రైతు బంధు డబ్బులు మంత్రుల ఖాతాల్లోకి వెళ్తున్నాయి. ఏ ఏ కంపెనీలకు డబ్బులు చెల్లించారో శ్వేతపత్రం విడుదల చేస్తారా? మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లను మరమ్మతులు చేయాలి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నీళ్ల కోసం రైతులు రోడ్లు ఎక్కుతున్నారు.

తక్షణమే డీఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 1 లో 1500 ఉద్యోగాలు ఉన్నాయని అన్నారు…ఇప్పుడు 1500 ఉద్యోగాలు ఎటు వెళ్లాయి? గ్రూప్ 2,గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నారనే సోయితో మాట్లాడాలి. ఇందిరమ్మ రాజ్యంలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి.

గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎంత మందిని బెదిరిస్తే అంత తిరుగుబాటు వస్తుంది. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు,వైఎస్,రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ని ఎదుర్కొన్నాం. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని ప్రజలు గ్రహిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో? ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్,వైఎస్ఆర్ ప్రజల్లో ముద్ర వేసుకున్నారు. కానీ రేవంత్ ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి,ఒక్క రోశయ్య లాగా మిగిలిపోతాడు. తెలంగాణల రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చి, తన పరిపాలనతో ప్రజల్లో ముద్ర వేసుకున్నారు

LEAVE A RESPONSE