ఏ2 రాహుల్ గాంధీని విమర్శించడమా ?

-ట్వీట్లు తప్ప ప్రజల్లోకి వచ్చే దమ్ముందా?
-వచ్చే ఎన్నికల్లో వైసీపీకి శంకరగిరి మాన్యాలే
-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్

విజయవాడ : ఏ2 గా ఉన్న విజయసాయి రెడ్డికి రాహుల్ గాంధీని విమర్శించే హక్కు లేదని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి శంకరగిరి మాన్యాలేనని స్పష్టం చేశారు. పేటీఎం బ్యాచ్ ద్వారా సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టడం తప్ప ప్రజల్లోకి వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ఎవరు ఇంటికి పోతారో క్రాక్ రెడ్డికి అర్థమయ్యే ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Leave a Reply