సర్పంచ్ లను ప్రభుత్వం బిచ్చగాళ్లుగా చూస్తోంది

-హక్కుల కోసం గళమెత్తిన సర్పంచ్ లపై నిర్బంధాలు కాదు…నిధులు ఇవ్వండి
– టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు

అమరావతి:- రాష్ట్రంలో పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక సంఘం నిధుల మళ్లింపుతో పంచాయతీలు తమ ఉనికి కోల్పోతున్నాయని చంద్రబాబు అన్నారు. రాజ్యంగబద్దంగా తమకు లభించిన హక్కుల కోసం పార్టీలకు అతీతంగా సర్పంచ్ లు నిన్న చేపట్టిన నిరసనలను ప్రభుత్వం అణిచివెయ్యడం దారుణం అని చంద్రబాబు అన్నారు. తమ సమస్య పై గళమెత్తిన సర్పంచ్ లపై కేసులు, నిర్బంధాలు వైసిపి ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనం అన్నారు. సర్పంచ్ ల సంఘం డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని…అవి వారి హక్కుల అని గుర్తించాలి అన్నారు. వైసిపి ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలతో పాటు….గ్రామీణ వ్యవస్థలో కీలకమైన పంచాయతీలు నాశనం అవుతున్నాయి. ప్రభుత్వం దారి మళ్లించిన 14,15 ఆర్థిక సంఘం నిధులు రూ. 8700 కోట్లు తిరిగి గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చెయ్యాలి.

2014 తరువాత టిడిపి హాయంలో దాదాపు 36 వేల కోట్ల 14వ ఆర్థిక సంఘం నిధులు, నరేగా నిధులు పంచాయతీలకే ఇచ్చాము. వీటి ద్వారానే సర్పంచ్ లు గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేపట్టారు. తద్వారా గ్రామాలలో సర్పంచ్ ల గౌరవాన్ని పెంచాం. అలాంటిది ఇప్పుడు వైసిపి ప్రభుత్వం సర్పంచ్ లను బిక్షగాళ్లలా చూస్తున్న వైఖరి దారుణం అని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తన తప్పుదిద్దుకుని ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో జమచేయ్యాలి. హక్కుల కోసం పోరాడుతున్న సర్పంచ్ లపై నిర్భంధాలు, కేసులు వెనక్కి తీసుకోవాలని టిడిపి అధినేత డిమాండ్ చేశారు.

Leave a Reply