అభివృద్ధిలో సికింద్రాబాద్ అగ్రగామి: పద్మారావు

సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రీతుల్లో అభివృద్ధిలో చేశామని, సంక్షేమం, అభివృద్ధిలో సికింద్రాబాద్ ను అగ్ర స్థానంలో తీర్చి దిద్దుతున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సీతఫలమండీ డివిజన్ పరిధిలో గురువారం రూ.82 లక్షల మేరకు విలువ చేశే వివిధ అభివృద్ధి పనులను తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ పరిధిలోని ఐదు పార్కులను ఎంపిక చేసి మోడల్ పార్కులు గా తీర్చి దిద్దుతున్నామని తెలిపారు. అన్ని స్మశాన వాటికలలో వివిధ సదుపాయాలని కల్పిస్తున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. కార్పొరేటర్ కుమారి సామల హేమ, డిప్యూటీ కమీషనర్ మోహన్ రెడ్డి, ఈ ఈ ఆశా లత, అధికారులు డాక్టర్ రవీందర్ గౌడ్, రఘు, కుమారి మధురిమ తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్, తదితరులు పాల్గొన్నారు. మొహమ్మద్ గూడా రెడ్ క్రాస్ పార్కు లో అభివృధి పనులు, బీదల బస్తీ లో cc రోడ్డు నిర్మాణం పనులు, సితఫలమండీ స్మశాన వాటికలో అభివృధి పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించి, డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల మీదుగా పదయాత్రను నిర్వహించారు.

Leave a Reply