Suryaa.co.in

Andhra Pradesh

సాగునీటి రంగాన్ని నాశనం చేసిన సీమ ద్రోహి జగన్ రెడ్డి

-ఒక్క ఎకరాకు నీరివ్వకున్నా.. ప్రతి గ్రామానికీ కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ పారించాడు
-సంపద సృష్టించి ప్రజల ఆదాయం పెంచాలనేది నా విజన్
-ప్రజలు నాశనమైపోయినా తన జేబులు నిండితే చాలు అనేది జగన్ రెడ్డి విజన్
-సూపర్ సిక్స్ తో ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకుంటా
-డబ్బు కోసం కల్తీ మద్యం, గంజాయి, డ్రగ్స్ తెచ్చి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నాడు
-అరాచక శక్తిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించాల్సిన సమయం ఆసన్నమైంది
– చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

వైసీపీని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైతులకు సబ్సీడీలు, గిట్టుబాటు ధరలు రావడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందా…ప్రాజెక్టులు పూర్తయ్యాయా…మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయా.? నేను హంద్రీనీవా నీళ్లు తెచ్చి వి.కోటలో నిలబెట్టా. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇచ్చిందా.?

అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ పెట్టి ఉద్యోగాలు ఇప్పిస్తాం. కార్మికులను, కూలీలను అడుగుతున్నా…మీకు ఈ ప్రభుత్వంలో ఉపాధి దొరుకుతుందా.? కనీసం ఉద్యోగులకు నెలజీతం సరిగా వస్తుందా.? రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ వస్తుందా.? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చారా.? టీడీపీ తెచ్చిన పథకాలన్నీ రద్దు చేశారు. మీరు ఏం నష్టపోయారో ఆలోచించండి. మీ జీవితాల్ని చీకటి మయం చేసిన వారిని గుర్తించి ఓడించండి.

అన్ని రంగాలను సైకో జగన్ నాశనం చేశాడు. సీమలో సాగునీటి ప్రాజెక్టులు అన్నీ భ్రష్టు పట్టాయి. రాజులు ఏలిన రతనాలసీమ రాళ్ల సీమగా మారింది. సాగునీటి రంగానికి ఊతం ఇచ్చింది ఎన్టీఆర్. కృష్ణా జలాలను సీమకు తెచ్చి సస్యశ్యామలం చేయాలనుకున్నది ఎన్టీఆర్. తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు-నగరిని ఎన్టీఆర్ ప్రారంభించారు. ఎన్టీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చాం. విభజన వల్ల నష్టం ఉన్నా ప్రాజెక్టులపై డబ్బులు ఖర్చు పెట్టాం.

ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు ఖర్చు చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిగెత్తించాం. నీళ్లు వస్తే అభివృద్ధి జరుగుతుంది. ఐదేళ్లలో 62 ప్రాజెక్టులు చేపట్టి 24 ప్రాజెక్టులు పూర్తి చేశాం. 32 లక్షల ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరించి 7 లక్షల ఎకరాలకు అదనంగా నీళ్లు ఇచ్చాం. సీమలోని సాగునీటి ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చు చేశాం. ఒక్క హంద్రీనీవాపై రూ.4,200 కోట్లు ఖర్చు చేశాం.

90 శాతం పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు 10 శాతం పూర్తి చేయలేక కరువును తీసుకొచ్చారు. ఈ రోజు నుండి ముసుగు వీరుడు వస్తున్నాడు…నిన్నటి దాకా పరదాలతో వచ్చాడు. జగన్ కు ఖాళీ రోడ్లతో జగన్ స్వాగతం పలకాలి. జగన్ కు స్వాగతం పలికినా… మద్ధతు తెలిపినా మీకు మీరు అన్యాయం చేసుకున్నట్లే.

రాయలసీమ ద్రోహికి తిరిగే అర్హత లేదు. జగన్ ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 102 మినీ ప్రాజెక్టులు రద్దు చేశాడు. ఉమ్మడి చిత్తూరులో 25 ప్రాజెక్టులను రద్దు చేసిన నీచ చరిత్ర వైసీపీది. టీడీపీ వచ్చాక ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రతనాల సీమగా మార్చుతాం. గోదావరి జలాలు కూడా సీమకు తెచ్చి వెలుగులు ఇస్తాం.

ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులపై సీమలో రూ.2,125 కోట్లు మాత్రమే జగన్ ఖర్చు చేశాడు. సాక్షి పనికి మాలిన పత్రిక..తప్పడు రాతలు రాస్తోంది. సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది లేనట్లు చూపిస్తున్నాడు. ఒక్క ఛాన్స్ అని నెత్తిన చేయిపెట్టి బుగ్గలు నిమిరాడు దుర్మార్గుడు. జగన్ పాలనలో ఎవరైనా బాగుపడ్డారా.?

ఒక్కసాక్షి పత్రికకు వందల కోట్ల ప్రకటనలు ఇచ్చాడు. సలహాదారులను డబ్బులు వసూలు చేయడానికి పెట్టుకున్నారు. వారి జీతానికి ఇచ్చినన్ని డబ్బులు కూడా సీమ ప్రాజెక్టులపై ఖర్చు చేయలేదు. సీమ ప్రజలు జగన్ ను నిలదీయాలి. సిద్ధం సభలకు బలవంతంగా జనాన్ని తరలించాడు…జగన్ ను ఇంటికి పంపడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో పేదలున్నారు..సీమలో కరువు ఉంది. సీమను రతనాల సీమగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నా. హంద్రీనీవా పూర్తి చేసి వి.కోటకు నీళ్లు ఇచ్చాను. గాలేరు నగరి పూర్తికి ప్రయత్నించా. గండికోటను పూర్తి చేసి పులివెందులకు నేను నీళ్లు ఇచ్చాను.

సీమలో మంచి పంటలు పండుతాయి…సెరీ కల్చర్, కూరగాయలు, పూల సాగు లాభసాటిగా ఉంటాయి. ఈ ప్రాంతంలోని వాతావరణంతో రైతులు బంగారం పండిస్తారు. సీమను జగన్ పూర్తిగా నాశనం చేశాడు. నీటి లభ్యత తక్కువగా ఉందని 90 శాతం సబ్సీడీతో డ్రిప్ ఇచ్చాం. హార్టికల్చర్ హబ్ గా సీమను తయారు చేయాలన్నది నా కల. త్వరలో జరిగే ఎన్నికలకు ప్రజాగళంను పలమనేరులోనే శ్రీకారం చుట్టాను. పలమనేరు ప్రజాగళం సూపర్ హిట్.

భగభగ మండే ఎండలో సైతం ఇంతమంది వచ్చారంటే మీ మనసంతా టీడీపీవైపే ఉంది. వైసీపీని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో పడేయాలి. టీడీపీకి సంసద సృష్టించడమే తెలుసు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి…ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుతుంది. సాగునీరు వస్తే పంటలు వేస్తారు..పంటలు అమ్ముకుంటే లాభాలు వస్తాయి. దీంతో మీ భూముల విలువ, కొనుగోలు శక్తి పెరుగుతుంది. సంపద సృష్టించి వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచుతాం.

జగన్ రూ.10 ఇచ్చి రూ.100 దోచే జలగ. మేము రూ.15 ఇచ్చి రూ.10 వేలు చేసేది టీడీపీ. పేదరిక నిర్మూళనకు నా శక్తి నంతా ఉపయోగిస్తా. 18 ఏళ్లు నుండి 59 ఏళ్లలోపు ఉన్న ప్రతి మహిళకు రూ.15 వందలు ప్రతినెలా అందిస్తాం. తల్లికి వందనం ద్వారా ప్రతి బిడ్డకు యేడాదికి రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరుంటే రూ.30 వేలు…నలుగురు ఉంటే రూ.60 వేలు ఇస్తాం. పిల్లలకు చదువు అందిస్తే ప్రపంచాన్ని జయిస్తారు.

దీపం పథకం ద్వారా యేడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. ఆడబిడ్డలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. అన్నదాత కింద ప్రతి రైతుకు యేటా రూ.20 వేలు అందిస్తాం. సబ్సీడీలు కూడా రైతులకు అందిస్తాం. రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే దాకా నిరుద్యోగ భృతిగా రూ.3 వేలు అందిస్తాం. పరిశ్రమలు తెచ్చి సొంతూరిలోనే ఉద్యోగాలు చేసుకునే పరిస్థితిని తీసుకొస్తాం.

ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం.50 ఏళ్లు నిండిన బీసీలకు రూ.4 వేలు పెన్షన్లు ఇస్తాం. కలలకు రెక్కల పథకం ద్వారా ఆడపిల్లలకు స్కిల్స్ పెంచి వడ్డీలేని రుణాలు అందిస్తాం. కూటమి అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం. అన్నా క్యాంటీన్లు మళ్లీ తీసుకొస్తాం. జె.బ్రాండ్ ను నివారిస్తాం. గంజాయి, డ్రగ్స్, జె.బ్రాండ్స్ ను 100 రోజుల్లోనే రాష్ట్రంలో లేకుండా చేస్తాం.

వైసీపీ నేతలు డబ్బులకు కక్కుర్తిపడి పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు.చేనేతలకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి పథకాలు అమలు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తాం. ఉద్యోగులు అండగా ఉంటాం..వేధింపులు లేకుండా చేస్తాం. మొదటి తారీకునే మీ ఇంటకి రూ.4 వేల పెన్షన్ ఇస్తాం. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా మొదటి తేదీనే పెన్షన్ ఇస్తానని భరసా ఇస్తున్నా.

టీడీపీ, జనసే, బీజేపీ కలిశాయి…ఇది మా స్వార్థం కోసం కాదు. దివాళా తీసిన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి కలిశాం. ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలవాలంటే జగన్ దిగిపోవాలి. ఒక అవినీతి, సైకో పాలనతో ఎంత నష్టపోయారో గుర్తు చేసుకోవాలి. రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశాడు. సంపద నిలిచించి…ఆదాయం తగ్గిపోయింది. ఇవన్నీ సజావుగా సాగాలంటే కేంద్ర సాయం కావాలనే మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి.

మైనారిటీ సోదరులకు చెప్తున్నా…40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా…జగన్ 10 ఏళ్లుగా ఉన్నాడు. ఐదేళ్లుగా కేంద్రంలో అన్ని బిల్లులు జగన్ మద్ధతు తెలిపి ఇప్పుడు నన్ను విమర్శిస్తున్నాడు. ముస్లింలకు ఇచ్చిన హామీలు జగన్ నెరవేర్చాడా.? రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము కలిస్తే మమ్మల్ని ప్రశ్నిస్తావా.? ఎన్డీయేలో ఉన్నప్పుడు కూడా గతంలో ఏ మైనారిటీ, ముస్లింకు అన్యాయం జరగలేదు. ఉర్దూను రెండవ బాషగా, ఉర్దూ యూనివర్సిటీ, షాదీఖానా, దుకాన్ మకాన్, రంజాన్ తోఫాను అమలు చేశాం.

మైనారిటీలకు జగన్ ఏ పథకమూ అమలు చేయలేదు..బీసీలకు పథకాలు రద్దు చేశాడు. ఎస్సీలను చంపి డోర్ డెలవరీ చేసింది. బీసీల భూముల కబ్జాను చేసిన పార్టీ వైసీపీ. వైసీపీ నేతల వేధింపులతో ఒంటిమిట్టలో సుబ్బారావు కుటుంబం, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పలమనేరులోనే మిస్బా ఉదంతం నా కళ్ల ముందు తిరుగుతూనే ఉంది. ఒక మైనారిటీ అమ్మాయి చదవుకోవడానికి అవకాశం లేదా.? వైసీపీ నాయకులు మిస్బాను వేధించి చదువుకోకుండా చేయడంతో ఆత్మహత్య చేసుకుంది.

మిస్బా కుటుంబానికి ఇచ్చిన హామీని కూడా వైసీపీ నేతలు విస్మరించారు. మళ్లీ వైసీపీకి ఓటేస్తే మిస్బాకు ఏం జరిగిందే అదే మీ పిల్లలకు జరుగుతుంది. 3 పార్టీల నేతలు, కార్యకర్తలను కోరుతున్నా…175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానలు గెలవాలి. ఎన్డీయే లక్ష్యం 400కు పైగా ఎంపీ స్థానాలు, రాష్ట్రంలో 24 ఎంపీ స్థానాలు రావాలి. రాష్ట్రంలో 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలు గెలుస్తున్నాం.

ఎంపీగా దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేగా అమర్నాథ్ ను గెలిపించాలి. మీ అందరి బంధువు అమర్నాథ్ రెడ్డి. దోపిడీ విధానాన్ని అరికట్టాలంటే అమర్నాథ్ రెడ్డిని గెలిపించాలి. మామిడి మార్కెట్ లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మోడల్ మార్కెట్ ను అధికారంలోకి రాగానే పూర్తి చేస్తాం. వి.కోటలో ప్రభుత్వ డిగ్నీ కాలేజీ, మహిళా ఉర్దూ కాలేజీకి నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం నిలిపేసింది. మన ప్రభుత్వం రాగానే పూర్తి చేస్తాం.

కౌండిన్య నదిపై చెక్ డ్యాములు నిర్మిస్తాం. ఏనుగుల సమస్య ఉంది..ఆ సమస్య పరిష్కారం కావాలంటే టీడీపీ గెలవాలి. ఇక్కడ పనికిమాలిన ఎమ్మెల్యే ఉన్నాడు..ఈ నియోజకవర్గానికి ఏమైనా చేశాడా.? హంద్రీనీవా నీళ్లు తెచ్చాడా…కానీ ఇసుకంతా తవ్వుకుని బెంగళూరు తరలించారు. క్వారీల యజమానుల నుండి డబ్బులు వసూలు చేస్తాడు. ఏ పని చేయాలన్నా 15 శాతం కమీషన్ కట్టాలి..అందుకే ఆయన్ను 15 శాతం కమీషన్ ఎమ్మెల్యే అంటారు. రూ.5 కోట్ల విలువ చేసే శివాలయం భూమిని మాయం చేశారు. మసీదుల భూమలు కూడా కొట్టేస్తాడు.

గంగమ్మతోపు వద్ద గంగవరంలో కోట్లు విలువ చేసే భూముల్ని కొట్టేశాడు. జనార్థన్ నాయుడుకు చెందిన క్వారీని కబ్జా చేసి దోచుకుని రూ.35 లక్షల కరెంట్ బిల్లులు కూడా కట్టాలని బెదిరించాడు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించిన ముగ్గురు విలేకరులపై దాడి చేసి వారిపైనే కేసులు పెట్టారు. అన్ని సర్వేలు మనమే గెలుస్తామని ఘోషిస్తున్నాయి. మొన్నటిదాకా వైనాట్ కుప్పం అని జగన్ అన్నాడు…నేను సవాల్ విసురుతున్నా వైనాట్ పులివెందుల.?

వివేకాను ఎవరు చంపారో వైసీపీ నేతలు సమాధానం చెప్పి ఓట్లు అడగాలి. మీ బాబాయిల గతి కూడా ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలి. ఓటుకు రూ.10 వేలు ఇస్తాడు…ఆ అవినీతి డబ్బులు మాకొద్దు అని ఛీ కొట్టండి. కాకినాడ శివాలయంలో పూజారిపై దాడి చేశారు. కొట్టడం, తిట్టడం, దూషించడం బయటపడ్డాక రాజీ చేయడం…ఇదీ వారి నైజం. వైసీపీ వస్తే మీ భూమి రికార్డులకు కూడా రక్షణ ఉండదు..ప్రాణాలకు రక్షణకు ఉండదు. దుర్మార్గులతో పోరాడుతున్నాం…మే 13వ తేదీ వరకూ అందరూ పోరాడండి. అందరినీ కాపాడుకునే బాధ్యత ఎన్డీయే కూటమి తీసుకుంది.

పార్టీలో చేరిక
ప్రజాగళం సభలో నియోజకవర్గానికి చెందిన….ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి, కౌన్సిలర్ బీఆర్ కుమార్, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీరాములు రెడ్డి, సీనియర్ నేతలు గోవిందరెడ్డి, నందకుమార్, తదితరులు పార్టీలో చేరారు. వీరికి చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

LEAVE A RESPONSE