కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత సుమంత్ రెడ్డి గుడ్ బై

– కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కీలక నేతగా వ్యవహరించిన సుమంత్ రెడ్డి

నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుమంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్పారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన ఈ రోజు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కి తన రాజీనామా లేఖ ను పంపారు.

నెల్లూరు జిల్లా నుండి NSUI నాయకుడిగా మొదలైన సుమంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అనతికాలంలోనే యువజన కాంగ్రెస్ నుండి జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయి పదవుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు.మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ముఖ్య అనుచరుడిగా కీలక బాధ్యతలు చేపట్టిన సుమంత్ రెడ్డి.

గతంలో నెల్లూరు జిల్లా DCMS చైర్మన్ గా 8 సంవత్సరాలు పనిచేసి సొసైటీ అభివృద్ధికి తనదైన ముద్ర వేసి నెల్లూరు జిల్లా ప్రజల మన్ననలు పొందిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు. ప్రస్తుతం ఎపిసిసి ప్రధాన కార్యదర్శి, తిరుపతి పార్లమెంట్ ఇంచార్జి గా, రాష్ట్ర కాంగ్రెస్ ఆస్తులు అభివృద్ధి కమిటీ మెంబెర్ గా వివిధ పదవుల్లో పనిచేస్తున్న సుమంత్ రెడ్డి అనూహ్యంగా అన్నీ పదవులతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Leave a Reply